ఐపీఎల్ 2022కు సంబంధించిన ఆట‌గాళ్ల వేలం జాబితా మంగ‌ళ‌వారం వెల్ల‌డి అయింది. అయితే రెండు రోజుల పాటు కొన‌సాగ‌నున్న‌ మెగా వేలంలో మొత్తం 590 మంది క్రికెట‌ర్లు బ‌రిలోకి దిగ‌నున్నారు. ఈ వేలంలో న‌మోదు చేసుకున్న 590 మంది క్రీడాకారుల్లో 228 మంది క్యాప్డ్ ప్లేయ‌ర్లు 355 మంది అన్‌క్యాప్డ్ ప్లేయ‌ర్లు,  అదేవిధంగా ఏడుగురు అసోసియేట్ నేష‌న్స్ కు చెందిన వారని అధికారికంగా ప్ర‌క‌ట‌న‌లో పేర్కొంది. ముఖ్యంగా శ్రేయాస్ అయ్య‌ర్‌, శిఖ‌ర్ ధావ‌న్‌, ఆర్‌.అశ్విన్‌, మ‌హ్మ‌ద్ ష‌మీ, ఇషాన్ కిష‌న్‌, అజింక్యా ర‌హ‌నే, సురేష్ రైనా, య‌జ్వేంద్ర చాహ‌ల్‌, వాషింగ్ట‌న్ సుంద‌ర్ వంటి అత్యుత్త‌మ భార‌త క్రికెట్ ప్ర‌తిభ‌వంతుల సేవ‌ల‌ను పొందేందుకు తీవ్ర యుద్ధం జ‌రుగుతుంది. శార్దూల్ ఠాకూర్‌, దీప‌క్ చాహ‌న్‌, ఇషాంత్ శ‌ర్మ‌, ఉమేష్ యాద‌వ్ వంటి భార‌త భౌల‌ర్లు వేలంలోకి దిగ‌నున్నారు.

ముఖ్యంగా డేవిడ్ వార్న‌ర్‌, ర‌విచంద్ర‌న్ అశ్విన్‌, ట్రెంట్ బౌల్ట్‌, ప్లాట్ క‌మిన్స్‌, క్వింట‌న్ డీ-కాక్‌, శిఖ‌ర్ ధావ‌న్‌, ఫాఫ్ డూప్లెసిస్‌, శ్రేయాస్ అయ్య‌ర్‌, క‌గిసో ర‌బాడ, మ‌హ్మ‌ద్ ష‌మీ ఈ మార్క్యూ సెట్‌లో భాగంగా ఉన్నారు. ఐపీఎల్ ఫ్రాంచైజీలు 10 చెన్నై సూప‌ర్ కింగ్స్‌, ఢిల్లీ క్యాపిట‌ల్స్‌, కోల్‌క‌తా నైట్ రైడ‌ర్స్‌, ముంబై ఇండియ‌న్స్‌, పంజాబ్ కింగ్స్‌, రాజ‌స్థాన్ రాయ‌ల్స్‌, రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు, స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్‌,  ల‌క్నో సూప‌ర్ జెయింట్స్‌, టీమ్ అహ్మ‌దాబాద్ ఐపీఎల్‌లో వేలంవేయ‌నున్నాయి.

ఫాఫ్ డుప్లెసిస్‌, డేవిడ్ వార్న‌ర్‌, ఫాట్ క‌మిన్స్‌, క‌గిసో ర‌బ‌డ‌, ట్రెంట్ బౌల్ట్‌, క్వింట‌న్ డికాక్, జానీ బెయిర్ స్టో, జాస‌న్ హోల్డ‌ర్‌, డ్వేన్ బ్రావో, ష‌కీబ్ అల్ హాస‌న్‌, వ‌నిందు హ‌స‌రంగా తో పాటు ఇంగ్లాండ్ ఫేస‌ర్ వేలంలోకి ప్ర‌వేశించారు. కేవ‌లం రూ.2కోట్లు అత్య‌ధిక రిజ‌ర్వ్ ధ‌ర 48 ఆట‌గాళ్లు త‌మ‌ను తాము ఈ బ్రాకెట్‌లో ఉంచుకోవ‌డానికి ఎంచుకున్నారు. 1.5 కోట్ల రిజ‌ర్వ్ ధ‌ర‌తో 20 మంది ఆట‌గాళ్లు వేలం జాబితాలో ఉండ‌గా.. 34 మంది ఆట‌గాళ్లు రూ.1కోటి రిజ‌ర్వ్ ధ‌ర‌తో ఐపీఎల్ వేలంలో ఉన్నారు. అయితే ఈసారి ఐపీఎల్ వేలంలో ఎవ‌రు అధిక ధ‌ర ప‌లుకుతారో తెలియాల‌ని కొద్ది రోజులు వేచి చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: