భారత్, బంగ్లాదేశ్ క్రికెట్ జట్ల మధ్య ఆదివారం రాత్రి జరగనున్న తొలి టీ - 20 పై ఉత్కంఠ కొనసాగుతోంది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ (ఫిరోజ్ షా కోట్ల) స్టేడియం వేదికగా ఆదివారం రాత్రి 7 గంటలకి మ్యాచ్ ప్రారంభంకానుండగా, దీపావళి తర్వాత ఢిల్లీలో కాలుష్యం ఊహించని స్థాయికి చేరింది. దీనితో ఢిల్లీలో నివసించే వారు కనీస జాగ్రత్తలు తీసుకోకుండా కనీసం ఇంటి వెలుపలికి కూడా వెళ్లొద్దని నిపుణులు గట్టిగా హెచ్చరిస్తున్నారు. ఈ పరిస్థితులలో తొలి టీ - 20 మ్యాచ్ జరగడం పై అనేక అనుమానాలు నెలకొన్నాయి.


దీపావళి రెండు రోజుల ముందు వరకూ ఢిల్లీలో కాలుష్యం 300 - 350 పాయింట్లతో ఉండగా ఆది నిన్న అంటే బుధవారం రోజున ఉదయం 11 గంటలకి అది 416 పాయింట్లకి చేరింది. ఈ పరిస్థితిలో ఔట్‌ డోర్ స్పోర్ట్స్ చాలా ప్రమాదమని వైద్యులు హెచ్చరిస్తున్నారు. 2017 సంవత్సరంలో ఇలానే ఢిల్లీ వేదికగా భారత్‌ తో టెస్టు మ్యాచ్ ఆడిన శ్రీలంక క్రికెటర్లు కాలుష్యం కారణంగా మైదానం లోపలే వాంతులు చేసుకున్న విషయం అందరికి తెలిసిందే. ఆ మ్యాచ్ ముగిసే వరకూ కొంత మంది క్రికెటర్లు మాస్క్‌ లు ధరించాల్సి వచ్చింది.


ఢిల్లీ, ఢిల్లీ పరిసరాల్లో కాలుష్యం ప్రమాద స్థాయికి చేరి ఉండటంతో మ్యాచ్ వేదికని మార్చాలని కొంత మంది మాజీ క్రికెటర్లు సూచనలు ఇస్తున్నారు. కానీ, భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ), ఢిల్లీ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోషియేషన్ (డీడీసీఏ) మాత్రం వేదిక మార్పునకి అసలు ఒప్పుకోవడం లేదు. దీనీతో ఇదే కాలుష్యంలో క్రికెటర్లు మ్యాచ్‌ ఆడితే మాత్రం అనారోగ్యం పాలయ్యే ప్రమాదం ఖచ్చితంగా ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ సిరీస్ గత కొద్దీ కాలంగా అనేక సమస్యలతో ప్రారంభం అవుతుందో లేదో వేచి చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: