ఇలా ప్రపంచ క్రికెట్లో ఇప్పటికే ఎంతగానో హవా నడిపించిన విరాట్ కోహ్లీ ఇప్పుడు మాత్రం గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్నాడు అని చెప్పాలి. ఒకప్పుడు వరుస సెంచరీలతో చెలరేగిన విరాట్ కోహ్లీ ఇక ఇప్పుడు తక్కువ పరుగులకే వికెట్ చేజార్చుకుంటున్నాడు. దాదాపు విరాట్ కోహ్లీ సెంచరీ చేసి మూడేళ్లు గడిచిపోతున్నాయి అని చెప్పాలి. ప్రతి మ్యాచ్లో కోహ్లీ సెంచరీ చేస్తాడని అభిమానులు ఎంతో ఆశగా ఎదురు చూడటం లాంటివి చేస్తూ ఉన్నారు. అయినప్పటికీ వారి ఆశ తీరడం లేదు అని చెప్పాలి. అయితే ఇటీవల టెస్ట్ మ్యాచ్ కు ముందు జరిగిన వార్మప్ మ్యాచ్లో బాగా రాణించిన విరాట్ కోహ్లీ సెంచరీ చేయడం పక్క అనే నమ్మకాన్ని కలిగించాడు.
కానీ టెస్ట్ మ్యాచ్ లో మొదటి ఇన్నింగ్స్ లో భాగంగా కేవలం 11 పరుగులు మాత్రమే చేసి విరాట్ కోహ్లీ వెనుదిరిగాడు అన్న విషయం తెలిసిందే. ఇక రెండవ ఇన్నింగ్స్ లో అయినా సత్తా చాటుతాడు అని అభిమానులు భావించారు. కానీ సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా విరాట్ కోహ్లీ 20 పరుగులకే ఏడు వికెట్లు కోల్పోయాడు. ఈ క్రమంలోనే విరాట్ కోహ్లీ పై వస్తున్న విమర్శలు మరింత ఎక్కువ అయ్యాయి అనే చెప్పాలి. ఇక విరాట్ కోహ్లీ నుంచి సెంచరీ ఆశించడం వృధా అంటూ ఎంతో మంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు అని చెప్పాలి. కొంతమంది ఇక కోహ్లీ నువ్వు సెంచరీ చేయడం మేము చూడలేమా అంటూ అభిమానులు సోషల్ మీడియా వేదికగా ప్రశ్నిస్తున్నారు.