ఒక పక్క వారి దేశంలో కరోనా వైరస్ తీవ్రత అధికంగా ఉన్నా సరే పాకిస్తాన్ మాత్రం కవ్వింపు చర్యలను ఆపడం లేదు. భారత్ లక్ష్యంగా ఏదోక రెచ్చగొట్టే కార్యక్రమాలను పాకిస్తాన్ చేస్తూనే ఉంది. తాజాగా పాక్ మరోసారి సరిహద్దుల్లో కాల్పుల విరమణ  ఒప్పందానికి తూట్లు పొడిచి కాల్పులకు దిగింది. 

 

ఈ రోజు మధ్యాహ్నం 1:45 గంటలకు కిర్ని సెక్టార్, పూంచ్, జమ్మూ & కాశ్మీర్లలో నియంత్రణ రేఖ వెంట చిన్న ఆయుధాలతో కాల్పులు జరిపి పాకిస్తాన్ కాల్పుల విరమణను ఉల్లంఘించిందని భారత ఆర్మీ పేర్కొంది. భారత సైన్యం కూడా అదే స్థాయిలో స్పందించి ప్రతీకారం తీర్చుకుందని పేర్కొన్నారు. ఇప్పుడు కాల్పులు ఆగిపోయాయని ఆర్మీ అధికారులు మీడియాకు వెల్లడించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: