ఈ క్రమంలో నేరుగా కరెంటు వైర్లు, కేబుల్ వైర్లపై పడి కిందకు జారాడు. అదృష్టవశాత్తు బాలుడికి స్వల్ప గాయాలే కావడంతో ప్రాణాపాయం తప్పింది. ఇటు వైర్లపై ఒకేసారి భారం పడటంతో కరెంటు స్తంభం కూడా కూలింది. బాలుడిని సమీపంలోని తన్వీర్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. ఇటు కరెంటు స్తంభం కూలడంతో శనివారం రాత్రి 8.30 గంటల నుంచి ఆదివారం మధ్యాహ్నం ఒంటి గంట వరకు కరెంటు సరఫరా నిలిచిపోయింది. సమాచారం అందుకున్న విద్యుత్ శాఖ సిబ్బంది కొత్త స్తంభాన్ని ఏర్పాటు చేసి విద్యుత్ సరఫరాను పునరుద్ధరించారు.
ఇదిలా ఉండగా పాపులర్ మొబైల్ గేమ్ మళ్లీ ఇండియాలోకి రీఎంట్రీ ఇస్తోంది. భారతదేశంలో లక్షలాది మంది పబ్జీ లవర్స్.. యాప్ లాంచ్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.పబ్జీ మొబైల్ ఇండియా రీఎంట్రీ ఇచ్చే అవకాశం ఉందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. పబ్ జీ మొబైల్ ఇండియా యాప్ లాంచ్ కు సంబంధించి ఒక టీజర్ వీడియో కూడా రిలీజ్ చేసింది కంపెనీ. డియాలో టెన్సెంట్ కంపెనీ యాప్ పబ్ జీ బ్యాన్ చేసిన తర్వాత పబ్ జీ మొబైల్ ఇండియా కొత్తగా రీఎంట్రీ ఇస్తోంది. సరికొత్త ఫీచర్లతో యూజర్లను ఆకట్టుకునేలా ఉంటాయని అంటున్నారు.