ఇంతకుముందు తుపాకి, కాకా కాక ,తెరి , వంటి బ్లాక్ బాస్టర్ సినిమాలు నిర్మించిన కూడా అసురన్ తో వచ్చిన లాభాలు ఏ సినిమా తో రాలేదని స్వయంగా నిర్మాత కలైపులి ఎస్ థాను వెల్లడించాడంటే ఈ చిత్రం ఏ రేంజ్ లో లాభాలను తీసుకొచ్చిందో అర్ధం చేసుకోవచ్చు. లో బడ్జెట్ లో తెరకెక్కిన ఈ చిత్రం ధనుష్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ హిట్ గా నిలిచింది. రూరల్ బ్యాక్ డ్రాప్ లో రివేంజ్ డ్రామా గా తెరకెక్కిన ఈ చిత్రంలో ధనుష్ నటన హైలైట్ గా నిలిచింది. వెట్రిమారన్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రంలో మలయాళ నటి మంజు వారియర్ ,ధనుష్ కు జోడీగా నటించగా జీవి ప్రకాష్ కుమార్ సంగీతం అందించాడు. కాగా ధనుష్ - వెట్రిమారన్ కాంబినేషన్ లో ఇది రెండో సినిమా. ఇంతకుముందు వీరి కాంబినేషన్ లో వచ్చిన వడ చెన్నై కూడా బ్లాక్ బాస్టర్ హిట్ అనిపించుకుంది.