డాషింగ్ డైరక్టర్ పూరి జగన్నాధ్ పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తో చేసిన బద్రి నుంచి ఇటివల వచ్చిన రామ్ ఇస్మార్ట్ శంకర్ వరకూ హీరోలను ఇదే విధంగా ఎలివేట్ చేశాడు. అయితే తనను దర్శకుడిగా మొదట పరిచయం చేసిన పవన్ కల్యాణ్ తనకు ఎలాంటి టెస్ట్ పెట్టాడో.. తాను ఎలా తెలివిగా వ్యవహరించాడో వివరించాడు ఓ ఇంటర్వ్యూలో. తన దగ్గరున్న అనేక కథల్లో ఓ లవ్ స్టోరీని ప్రిపేర్ చేసి తొలి ప్రయత్నంగా దర్శకత్వం వహించాలని అనుకున్నాడట పూరి. పవన్ కు కథ చెప్పాలని పూరి ఆలోచనట.

 

 

అప్పటికే తనకు ఫ్రెండ్ అయిన సినిమాటోగ్రాఫర్ శ్యామ్ కె నాయుడు ద్వారా అతని అన్న చోటా కె నాయుడును అప్రోచ్ అయ్యాడట. అప్పుడు తనకు ఇట్టు శ్రావణి సుబ్రహ్మణ్యం కథ చెప్పాడట. బద్రి కథ చెప్తే కాదంటాడేమో అని లవ్ స్టోరీ చెప్పాడట. చోటా రికమెండేషన్ తో పవన్ ను అప్రోచ్ అయితే తెల్లవారుఝామున 3గంటలకు రమ్మన్నాడట పవన్. చెప్పిన సమయానికే వెళ్లిన పూరి అప్పడు పవన్ కు చెప్పింది మాత్రం బద్రి స్టోరీ. కథ బాగుందన్న పవన్ క్లైమాక్స్ మార్చి రమ్మన్నాడట. ఎన్ని రకాలుగా ప్రయత్నించినా మొదటి వెర్షనే నచ్చడంతో పూరి మార్చలేకపోయాడట. ధైర్యం చేసి పవన్ వద్దకు వెళ్లి మళ్లీ సేమ్ వర్షన్ చెప్పాడట.

 

 

క్లైమాక్స్ ఎందుకు మార్చలేదన్న పవన్ ప్రశ్నకు.. ఈ కథకు ఈ క్లైమాక్స్ అయితేనే బాగుంటుంది.. మార్చలేను అని చెప్పాడట. అప్పుడు పవన్.. ఈ క్లైమాక్స్ గానీ నువ్వు మార్చుంటే నువ్వు ఈ సినిమా చేయగలిగేవాడివి కాదు. నీ స్క్రిప్ట్ సెన్స్ టెస్ట్ చేసేందుకే అలా అన్నాను అని అన్నాడట పవన్. బద్రి ఎంత హిట్ అయిందో తర్వాత పూరి జగన్నాధ్ ఎంతటి టాప్ డైరక్టరయ్యాడో తెలిసిందే.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: