మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడు వైష్ణవ్ తేజ్ హీరోగా తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అవుతున్న సినిమా ఉప్పెన. ఈ సినిమాలో వైష్ణవ్ తేజ్ సరసన కృతి శెట్టి హీరోయిన్ గా తెలుగు ఇండస్ట్రీకి తొలి పరిచయం అవుతుంది. ఈ సినిమాలో విజయ్ సేతుపతి కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమా మా మైత్రి మూవీ మేకర్స్ సుకుమార్ నిర్మాతగా వహిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి ఫస్ట్ లుక్ పోస్టర్, రెండు లిరికల్ పాటలు కూడా విడుదల చేయడం జరిగింది. ఇందులో ముఖ్యంగా "ఇస్క్ సిఫాయ... ఇస్కే సిఫయ..." అన్న పాట ప్రేక్షకులను బాగా ఆకట్టుకోవడంతో జరిగింది. దీనితో సినిమాపై ప్రేక్షకులకు భారీ అంచనాలు ఉన్నాయి. అన్ని పరిస్థితులు బాగా ఉన్నట్లు అయితే ఏప్రిల్ 2న చిత్ర యూనిట్ విడుదల చేయాలని అనుకున్నారు. దానికి అనుగుణంగానే షూటింగ్ కూడా చాలా త్వరగా పూర్తిచేసుకుని. కానీ కరోనా వైరస్ కారణంతో ఈ సినిమా విడుదల వాయిదా పడింది. 

 

 

ఆ తర్వాత మరి ఈ సినిమాని మే 7న విడుదల చేయాలని నిర్ణయించుకున్నారు కానీ పరిస్థితులు లేకపోవడంతో మళ్లీ ఈ సినిమాని డిసెంబర్ కి వాయిదా వేయాలని సినిమా నిర్మాతలు ఆలోచిస్తున్నారని సమాచారం. ఇక విశ్వసనీయవర్గాల సమాచారం మేరకు ఉప్పన సినిమాని డిసెంబర్ 7న విడుదల చేసే అవకాశాలు ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతానికి మాత్రం డైరెక్టర్ పోస్ట్ డైరెక్షన్ వర్క్ కి షెడ్యూల్ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటివరకు సినిమాకు సంబంధించిన అన్ని షూటింగ్ పనులు పూర్తి చేయగా.. చిన్న చిన్న కరెక్షన్ చేయాలని సినిమా నిర్మాతలు. దీనితో ఈ సినిమాకి మరీ ఎక్కువగా రీషూట్ అవసరం లేదు అని అర్థమవుతుంది.  

 


ఇప్పటికే ఇలాంటి హీరోకి చాలా ఖర్చు చేసి ఈ సినిమా తీసుకున్నామని సినిమా నిర్మాతలకి చాలా పెద్ద సమస్యగా మారింది. ఇంత ఇంత పెట్టుబడి పెట్టి సినిమా తీస్తున్నాం కనుక ఈ పరిస్థితులు కుదుట పడ్డాకే విడుదల చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు చిత్ర యూనిట్ తెలియజేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: