మెగాస్టార్ చిరంజీవి వరుసగా సినిమాలని ఒప్పుకుంటున్నాడు. సైరా నరసింహారెడ్డి తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య మూవీ ఇంకా సెట్స్ పై ఉండగానే మళయాల చిత్రమైన లూసిఫర్ సినిమాని రీమేక్ చేసేందుకు సిద్ధం అయ్యాడు. సాహో చిత్రంతో బాక్సాఫీసు వద్ద పేలవమైన ఫ్లాప్ ఇచ్చిన సుజిత్ కి లూసిఫర్ బాధ్యతల్ని అప్పగించాడు. సాహో సినిమా ఫ్లాఒ అయినప్పటికీ అందులోని స్టైలిష్ మేకింగ్ నచ్చిన చిరంజీవి ఈ అవకాశాన్ని ఇచ్చాడు.

 

 

ప్రస్తుతం సుజిత్ లూసిఫర్ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకుల తగిన విధంగా మార్పులు చేస్తున్నాడు. ఒరిజినల్ లేని చాలా అంశాలని ఇందులో చేర్చుతున్నారట. మళయాలంలో సూపర్ హిట్ సాధించిన ఈ చిత్రం తెలుగులో డబ్ అయింది. మరి అలాంటప్పుడు మరింత జాగ్రత్త అవసరం ఉన్న నేపథ్యంలో తెలుగు డబ్బింగ్ వెర్షన్ చూసినవాళ్ళు కూడా కొత్తగా ఉందే అనుకునేలా తీర్చిదిద్దుతున్నాడట.

 

 

ఇందులో మెగాస్టార్ కోసం హీరోయిన్ ని తీసుకుంటున్నారట. అంతే కాదు హీరో ఎలివేషన్ సీన్స్ బాగానే రాస్తున్నాడట. ఈ విషయంలో సుజిత్ కి చాలా ఫ్రీడమ్ ఇచ్చాడట. ఆ ఫ్రీడమ్ ని ఉపయోగించుకుని మంచి కథనంతో లూసిఫర్ స్క్రిప్టుకి మెరుగులు దిద్దుతున్నాడు. అయితే ఇంకా ఈ సినిమాలో మారుస్తున్న అంశాలలో ముఖ్యంగా అన్న చెల్లెళ్ల అనుబంధాన్ని మరింత ఎలివేట్ చేయనున్నారట.

 

 

ఈ మార్పులన్నీ పూర్తయ్యాక చిరంజీవికి వినిపించనున్నాడట. చిరంజీవి గనక ఓకే అంటే ఈ సినిమా పట్టాలెక్కినట్టే. సాహో సినిమా ఫ్లాప్ తో అవస్థలు పడుతున్న సుజిత్ కి మంచి అవకాశం దొరికినట్లు అవుతుంది. మరి ఈ అవకాశాన్ని సుజిత్ ఎంత మేరకు ఉపయోగించుకుంటాడో చూడాలి. ఈ సినిమా కూడా కొణిదెల ప్రొడక్షన్ బ్యానర్ లోనే తెరకెక్కనుందని అంటున్నారు. ఈ సినిమాలో హీరోయిన్ గా ఆచార్యలో క్రియేటివ్ డిఫరెన్స్ వల్ల తప్పుకున్న త్రిషనే తీసుకునేందుకు ఎక్కువ ఛాన్సెస్ కనిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: