బాలీవుడ్‌ యంగ్ హీరో సుశాంత్ సింగ్‌ రాజ్‌పుత్‌ మరణించి 14 రోజులు దాటిన ఇండస్ట్రీతో అభిమానులు కూడా ఆ షాక్‌ నుంచి కోలుకోలేకపోతున్నారు. ఇప్పటికీ సుశాంత్‌కు సంబంధించిన వార్తలు మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఓ ఇంట్రస్టింగ్ బయటకు వచ్చింది. సుశాంత్ మరణం తరువాత ఆయన కుటుంబం కీలక నిర్ణయం తీసుకుంది.

 

సుశాంత్ కుటుంబం సభ్యులు దివంగత నటుడి పేరు మీద ఓ ఫౌండేషన్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ ఫౌండేషన్ ద్వారా సుశాంత్‌లా అవకాశాలు అందుకోలేకపోయిన యువ నటులు, క్రీడాకారులు, సైంటిస్ట్‌లకు సాయం చేయాలని నిర్ణయించుకున్నారు. అదే సమయంలో సుశాంత్ చిన్నతనంలో పెరిగిన పాట్నాలోని ఇంటిని మ్యూజిక్‌గా మార్చేందుకు నిర్ణయించారు.

 

ఈ ఇంట్లో సుశాంత్ ఎంతో ఇష్టంగా కొనుక్కున్న టెలిస్కోప్‌ను ప్రదర్శనకు ఉంచనున్నారు. అయితే తాజాగా ఆ టెలిస్కోప్‌కు సంబంధించి ఆసక్తికర విషయాన్ని వెల్లడించాడు సుశాంత్‌ తండ్రి. సుశాంత్‌కు ఖగోళ శాస్త్రం మీద ఎంతో ఇష్టమన్న ఆయన తండ్రి ఆ ఇష్టంతోనే చంద్రుడి  మీద స్థలాన్ని కూడా కొనుగోలు చేశాడని చెప్పాడు. అంతేకాదు అంతరిక్షాన్ని దగ్గరగా చూసేందుకు ఏకంగా 55 లక్షలతో టెలిస్కోప్‌ను ఖరీదు చేశాడని చెప్పాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: