భారతదేశ చలనచిత్ర పరిశ్రమలో గతంలో ఎవరూ, ఏ భాషలో నిర్మించలేనటువంటి భారీ బడ్జెట్తో, హై యాక్షన్ ఓల్టేజ్ మూవీగా తెరకెక్కుతోన్న RRR విడుదలకు సిద్ధమవుతోంది. నందమూరి అభిమానులు, మెగా అభిమానులు కళ్లల్లో ఒత్తులు వేసుకొని సంయుక్తంగా ఎదురుచూస్తున్న ఈ సినిమాపై అంచనాలు కూడా రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. ఒకరకంగా అభిమానులంతా మునివేళ్లపై ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారనుకోవచ్చు.
అభిమానులందరికీ ఒక శుభవార్తలాంటి విషయం బయటకు వచ్చింది. ఒకరకంగా వారికిది పండగే. బాహుబలి అనంతరం దర్శకధీరుడు రాజమౌళి రూపొందిస్తున్న ఈ సినిమా కోసం దేశవ్యాప్తంగా సినీ అభిమానులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక సినిమాకు సంబంధించిన ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ పై రూమర్స్ గట్టిగానే వస్తున్నాయి. భారీ స్థాయిలో బిజినెస్ డీల్స్ ఈ బిగ్ బడ్జెట్ పాన్ ఇండియా సినిమా మొదటి రోజే ఈజీగా వందకోట్లను రాబట్టగలదని అందరికి ఒక క్లారిటీ వచ్చేసింది. సినిమాను ఇదే ఏడాది అక్టోబర్ 13న గ్రాండ్ గా విడుదల చేయబోతున్న విషయం తెలిసిందే. అయితే సినిమాకు సంబంధించిన బిజినెస్ డీల్స్ కూడా చాలా వరకు ముగిశాయి.ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో అన్ని ప్రధాన ఏరియాల్లో భారీ ధరకు ఈ సినిమా అమ్ముడైనట్లు సమాచారం. తమిళనాడుకు సంబంధించిన ధియేటర్ హక్కులను ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ రూ.50 కోట్లకు దక్కించుకున్నట్లు ఫిల్మ్నగర్ వర్గాల సమాచారం.
మార్చి 15న ఈ సినిమాకు సంబంధించి ఒక ప్రత్యేకమైన అప్డేట్ రానుంది. ఇప్పటికే హీరోలకు సంబంధించిన టీజర్స్ రెండు వచ్చేశాయి. అలాగే మెయిన్ లీడ్ కు సంబంధించిన ఫారిన్ ఆర్టిస్టుల పోస్టర్స్ ను కూడా ముందే రిలీజ్ చేశారు. మరికొందరి లుక్స్ కూడా రివీల్ చేయాల్సి ఉంది. రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రకు జోడిగా ఆలియాభట్ సీత పాత్రలో నటిస్తోంది. మార్చి 15న అలియా భట్ పుట్టినరోజు సందర్భంగా ఈ మూవీలో ఆమె ఫస్ట్ లుక్ విడుదల చేయనున్నట్లు సమాచారం.