ప్రపంచం మొత్తం కరోనా కారణంగా భయంతో వణికిపోతోంది.ఇక కరోనా వైరస్ ఊహించని స్థాయిలో చాప కింద నీరులాగా  వ్యాపిస్తూ విజృంభిస్తోంది. మరోవైపు దేశంలో లాక్ డౌన్ ఉండదని ప్రధాని మోదీ క్లారిటీ ఇచ్చారు. కానీ, పరిస్థితి అయితే చేయిదాటిపోయినట్టే కనిపిస్తోంది. నమోదవుతున్న కేసులు చూస్తుంటే. అందుకే చాలా రాష్ట్రాలు ఇప్పటికే నైట్ కర్ఫ్యూలు విధించాయి.ఇక చాలా ఘోరంగా ఈ వైరస్ విలయతాండవం చేస్తుంది. ఇక కరోనా వైరస్ బారినపడుతున్న వారి సంఖ్య కూడా క్రమ క్రమంగా పెరుగుతోంది. దేశవ్యాప్తంగా నిన్న ఒక్కరోజే 3 లక్షలకు పైగా కేసులు నమోదయ్యాయి. దీంతో.. ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఇటు అత్యంత జాగ్రత్తగా ఉండే సెలబ్రిటీలను సైతం కొవిడ్ వదిలిపెట్టట్లేదు. తెలుగు చిత్ర పరిశ్రమలో ఇప్పటికే పలువురు ప్రముఖులు కొవిడ్ బారిన పడగా.. తాజాగా మహేష్ బాబు క్వారంటైన్లోకి వెళ్లడం కలకలం రేపుతోంది.


ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబు పరశురామ్ పెట్ల డైరెక్షన్ లో అత్యంత జాగ్రత్తలు తీసుకొని మరీ 'సర్కారు వారి పాట' చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. కొద్ది రోజుల క్రితం వరకు షూటింగ్ ను వాయిదా వేసిన మహేష్.. త్రివిక్రమ్ సినిమాను త్వరగా స్టార్ట్ చేసేందుకు ఈ చిత్రం వేగం పెంచారు.అయితే.. తాజాగా తన పర్సనల్ స్టైలిష్ట్ కరోనా బారిన పడ్డారని సమాచారం. అతనితోపాటు మరికొందరిలోనూ కొవిడ్ లక్షణాలు కనిపించడంతో సినిమా షూటింగ్ నిలిపేసినట్టు తెలుస్తోంది. అంతేకాదు.. ముందు జాగ్రత్తలో భాగంగా మహేష్ క్వారంటైన్ లోకి వెళ్లినట్టు తెలుస్తోంది. ఈ విషయం తెలియడంతో.. ఫ్యాన్స్ ఆందోళనకు గురవుతున్నారు. పవన్ కూడా క్వారంటైన్లోకి వెళ్లడం.. ఆ తర్వాత కొవిడ్ నిర్ధారణ కావడం తెలిసిందే.ఇక సూపర్ స్టార్ మహేష్ బాబుకి కూడా కరోనా పాజిటివ్ వస్తుందేమోనని అభిమానులు భయపడుతున్నారు. పాజిటివ్ రాకుండా ఆయన సురక్షితంగా వుండాలని మహేష్ అభిమానులు ప్రార్ధిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: