రణబీర్ కపూర్ హీరోగా నటిస్తున్న యానిమల్ సినిమాకు దర్శకత్వం వహిస్తున్న ఈ దర్శకుడు ఆ తర్వా త
ప్రభాస్ లాంటి ఫ్యాన్
ఇండియా స్టార్ తో
సినిమా చేస్తూ ఉండడం విశేషం.
రష్మిక మందన ఈ యానిమల్ సినిమాలో
హీరోయిన్ గా నటిస్తుంది. ఆ విధంగా
సందీప్ రెడ్డి వంగా ఈ యానిమ ల్
సినిమా చేసి న తర్వాత
ప్రభాస్ హీరోగా రూపొందుబోయే చిత్రానికి దర్శకత్వం వహించబోతున్నాడు అయితే తాజాగా వినిపిస్తున్న వార్తల ప్రకారం ఈ
సినిమా మరికొన్ని రోజులు లేట్ అయ్యే పరిస్థితిలో ఉన్నాయట.
ప్రభాస్ హీరోగా చాలా సినిమాలే ఇప్పుడు సెట్స్ మీద ఉన్నాయి. వాటిలో ముందుగా
ఆది పురుష చిత్రం సంక్రాంతి కానుకగా థియేటర్లలో విడుదల కాబోతుంది ఆ తరువాత ఆయన
మారుతి సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సిద్ధం చేస్తున్నాడు. ఇక ప్రశాంత నీల్ దర్శకత్వంలోని చిత్రం కూడా చిత్రీకరణ చేసుకుంటుంది. ఇంకొక వైపు ఈ మూడు సినిమాల్లో మాత్రమే కాకుండా
నాగ్ అశ్విన్ దర్శకత్వంలోని ప్రాజెక్టు కే
సినిమా కూడా రూపుదిద్దుకుంటుంది. ఆ విధంగా ఈ నాలుగు సినిమాలను పూర్తి చేయడానికి చాలా సమయం పడుతుంది కాబట్టి
ప్రభాస్ సినిమా మొదలుపెట్టే సమయానికి
సందీప్ రెడ్డి ఖాళీగా ఉండడం ఇష్టం లేకపోతే వేరే హీరోతో వెళ్ళవలసి ఉంటుంది. మరి ఈ
సినిమా గురించి
సందీప్ రెడ్డి వంగా ఏ విధంగా ఆలోచిస్తారో చూడాలి.