తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎలాంటి సపోర్టు లేకుండా స్వయంకృషితో పైకి ఎదిగిన హీరోలలో మెగాస్టార్ చిరంజీవి ఒకరు..మెగాస్టార్ చిరంజీవి దేశంలోని అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించేటువంటి పద్మ విభూషణ్ పురస్కారాన్ని సైతం ఈరోజు అందుకున్నారు. రాష్ట్రపతి భవన్ లో జరిగిన పద్మ అవార్డుల వేడుకకు సైతం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతువుల మీదుగా ఈ పద్మ విభూషణ్ అవార్డుని అందుకున్నారు. ఈ కార్యక్రమానికి చిరంజీవి భార్య సురేఖ.. అలాగే వీరి కుమారుడు రామ్ చరణ్ కోడలు ఉపాసన కూడా హాజరయ్యారు.. రిపబ్లిక్ డే రోజున పద్మ విభూషణ్ అవార్డులను సైతం కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.. ఇటీవలే ఢిల్లీలో రాష్ట్రపతి భవన్ లో జరిగిన ఈ అవార్డుల వేడుకకు చిరంజీవి హాజరు కాలేకపోయారు.


అందుకే ఈ రోజున పద్మ విభూషణ్ అవార్డులను సైతం ఇచ్చారు. అలాగే చిరంజీవి గారితో పాటు సినీనటి వైజయంతి మాల బాలి కూడా ఈ పద్మ విభూషణ్ అవార్డుని అందుకోవడం జరిగింది. మెగా అభిమానులు ఈ విషయం తెలిసి చాలా సంబరపడిపోతున్నారు. గతంలో రాజకీయంగా ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత కొన్ని కారణాల చేత రాజకీయాలకు దూరమైన చిరంజీవి మళ్ళీ తిరిగి ఇండస్ట్రీలోకి రీఎంట్రీ ఇచ్చి మంచి విజయాలను అందుకుంటున్నారు. చిరంజీవి కుమారుడు రామ్ చరణ్ కూడా ఎన్నో చిత్రాలలో నటిస్తూ గ్లోబల్ స్టార్ గా పేరు సంపాదించారు.


చిరంజీవి సినిమాల విషయానికి వస్తే డైరెక్టర్ వశిష్ట తో కలసి విశ్వంభర సినిమాలో నటిస్తున్నారు. ఇందులో హీరోయిన్ గా త్రిష నటిస్తోంది.. చివరిసారిగా చిరంజీవి నటించిన భోళా శంకర్ సినిమా భారీ డిజాస్టర్ కావడంతో చిరంజీవి క్రేజ్ కాస్త తగ్గుతోందని కూడా చెప్పవచ్చు ఈ సినిమాతో చాలా దారుణమైన ట్రోల్స్ కి కూడా గురయ్యారు. మరి ఇలాంటి సమయంలో ఈ పద్మ విభూషన్ అవార్డు కూడా చిరంజీవి అందుకోవడంతో మరింత క్రేజ్ పెరుగుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: