కోలీవుడ్ లో ఎన్నో వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తున్న హీరో శింబు మరోసారి వార్తల్లోకి ఎక్కారు. శింబు పై  నిర్మాత జ్ఞానవేల్ రాజా నిర్మాతల కౌన్సిల్ లో ఫిర్యాదు చేశారు. హీరోగా, గాయకుడిగా, పాటల రచయితగా  మల్టీ టాలెంటెడ్ అయిన శింబు హీరోగా, సైడ్ హీరోగా నటిస్తున్న విషయం తెలిసిందే. తెలుగు లో కూడా ఒకటీ రెండు పాటలు పాడాడు శింబు.  అయితే హీరోగా ఎంత క్రేజ్ సంపాదించినా..అంతకు మించి వివాదాలు మూటగట్టుకున్నాడు. 

ఇప్పటికే కెట్టవన్, మన్మథన్, ఏఏఏ అనే పలు సినిమాల గురించి శింబుపై అనేక ఫిర్యాదులు నమోదు అయ్యాయి. తాజాగా  నిర్మాత జ్ఞానవేల్ రాజా తనను హీరో శింబు ఇబ్బంది పెట్టాడని ఫిర్యాదు చేయడం తమిళ సినీ పరిశ్రమలో కలకలం రేగింది. శింభు వైఖరితో సినిమాలో నటిస్తున్న ఇతర నటీనటుల షూటింగ్‌ కు అంతరాయం కలిగిందని,దీంతో చిత్ర నిర్మాణ ఖర్చు భారీగా పెరిగిందని తెలిపారు. మిగతా నటీనటుల షూటింగ్‌కు అంతరాయం కలిగిందని, వీరికి అనవసరంగా నష్టపరిహారం చెల్లించాల్సి వస్తోందని తెలిపారు.

మొదటి పదిరోజుల షూటింగే జరగలేదని ఆయన తన ఫిర్యాదులో తెలిపారు. హీరో శింబు చేసిన నిర్లక్ష్యం వల్ల డబ్బులు అధికంగా ఖర్చవుతున్నాయని, దీనికి శింబు కారణమని, సినిమా షూటింగ్ ప్రారంభమైన తరువాత పదిరోజుల పాటు ఒక్క సీన్ షూటింగ్ కూడా జరగలేదని మండలికి ఇచ్చిన ఫిర్యాదులో జ్ఞానవేల్ రాజా తెలిపారు. కాగా, షూటింగ్ జరుగుతుండగానే మధ్యలో ఆగిపోయిన మూవీల్లో ఇది మూడోది కావడం గమనార్హం. ఇప్పటికే రెండు సినిమాలు మధ్యలోనే ఆగిపోయాయి. మరి నిర్మాత చేస్తున్న ఆరోపణలకు శింబు ఎలా స్పందిస్తారో చూడాలి. 


మరింత సమాచారం తెలుసుకోండి: