ఇన్నాళ్లు తనకు మోసం చేసిన వ్యక్తుల గురించి స్పందించిన నటి శ్రీరెడ్డి తాజాగా జబర్ధస్త్ కమెడియన్ హైపర్ ఆదిపై ఫైర్ అయింది. జబర్ధస్త్ కామెడీ షో లోని స్కిట్లో ఆది వేసిన సెటైర్లపై స్పందించిన ఆమె ఘాటు వాఖ్యలు చేసింది. మహిళల్ని అగౌరవ పరిచేలా పిచ్చి పిచ్చి స్కిట్లు చేస్తే చెప్పుతీసుకుని చావగొడతా అంటూ ఫేస్బుక్లో హైపర్ ఆదికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది.
నిన్న హైపర్ ఆది గురించి అంటూ కాప్షన్ పెట్టి మరీ ఫేస్ బుక్ లైవ్ లో వచ్చిన ఆమె ఆదిని పొగుడుతూనే తిట్ల పురాణం అందుకుంది. "మీ మీద నాకు ఎలాంటి కోపం లేదు. చాలా గౌరవం ఉంది. మీరు మంచి రైటర్, యాక్టర్. జబర్ధస్త్ షో ద్వారా చాలా మందికి అవకాశం ఇస్తున్నారు. ఇందుకు మిమ్మల్ని అభినందిస్తున్నా. అయితే మీరు మంది బుద్ది ఇలా తగలడుతుందని నేను ఊహించలేదు. మీ మీద ఎవరో ఒత్తిడి తెస్తే ఇలా పిచ్చి రాతలు రాస్తున్నారా? లేక మీరే స్వతాహాగా రాశారా? ఒకవేళ ఆ పిచ్చి జోకుల వెనుక ఆ షో న్యాయనిర్ణేత నాగబాబు ప్రమేయం ఉంటే మాత్రం రాజకీయంగా ప్రభావం చూపుతుంది" అని ఆమె హెచ్చరించారు.
"పిచ్చి పంచ్లు వేసే ఆదికి, వాటికి వెర్రి నవ్వులు నవ్వే వాళ్లకు నేను ఒకటి చెప్పాలనుకుంటున్నా. నన్ను ఉద్దేశించి పెయిడ్ ఆర్టిస్ట్లు అంటూ జబర్దస్త్లో పంచ్లు వేశారు. ఇలాంటి పిచ్చి వేశాలు వేస్తేనే జబర్దస్త్ ఆర్టిస్ట్లను ఫిల్మ్ నగర్ రోడ్ల మీద తరిమి తరిమి కొట్టారు. మీరు శృతి మించిన కామెడీ చేస్తే, ఎవరో వచ్చి కొట్టేదాకా నేను వెయిట్ చేయను. నా చేతికి దురద ఎక్కువ. అది అందరికీ తెలిసిందే. పిచ్చకొట్టుడు కొడతా, చెప్పుతో కొట్టడానికి కూడా వెనుకాడను" అంటూ చెప్పింది.