దేశంలో గగూఢచర్యం ఒక కీలకమైనటు విభాగం. గూడుచర్యం లో సరైనటువంటి ప్రావీణ్యత ఉంటే ఎన్ని సాధించవచ్చు అనేటువంటిది ఇప్పటికే కొన్ని దేశాలు నిరూపించాయి. కాని భారతదేశంలో రా కొంతమంది రాజకీయ నాయకుల వల్ల దెబ్బతిన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఎన్ఐయే మొబైలైజేషన్ తో పాటు.. కౌంటర్ ఇంటెలిజెన్స్ అనే గూడచారి సంస్థ ప్రస్తుతం మనదేశంలో అద్భుతంగా పని చేసుకుంటూ వస్తుంది. భారతదేశంలో గూఢచర్యం ఎంతో ప్రాధాన్యత తో కూడుకొని ఉంది అని తెలిపేదే గతంలో పాకిస్థాన్ నేపాల్ విషయంలో జరిగింది ప్రస్తుతం చైనా విషయంలో జరుగుతుంది.
వ్యూహాలను ప్రోత్సహించే ప్రభుత్వాలతో పాటు వ్యూహాలను అమలు చేసే గూడ చర్యం కూడా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈ విషయంలో ఎంతో విజయవంతంగా ముందుకు సాగుతున్నారు విజయ్ దోవల్. అయితే గత కొన్ని రోజులుగా ఏదో ఒక వాదన తెరమీదకు తెస్తు నాటకాలు ఆడినట్టువంటి చైనాతో.. అజిత్ ఓ గంట పాటు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి గానే చైనా వెనక్కి వెళ్ళడం మొదలు పెట్టింది. చైనా ఏ రూట్ లో నుండి ఎలాంటి నాటకాలు ఆడుతున్నారు వాళ్ళకే వినిపించి ఆశ్చర్యపరిచాడు దోవల్.
వాళ్లు భారత్కు తెలియదు అని ధీమాగా ఉన్న సమాచారాన్ని కూడా వారికే తెలియజేయడం. పాకిస్తాన్లో మోహరింపు కూడా చైనా బలంతోనే జరుగుతున్నాయి అని ఇటువంటివి మనకు తెలిసిపోయింది వాళ్లకు తెలిసేలా చేయడం. అంతే కాకుండా ఇతర దేశాల దగ్గర చైనా ఆడుతున్న అటువంటి నాటకాన్ని కూడా వాళ్ళకి గుర్తు చేయడం... ఈ లోసుగులు అన్నింటినీ దౌత్యపరమైన రూట్ లో తీసుకువెళ్తే .. ప్రపంచ దేశాలన్నీ చైనా పై విరుచుకుపడి యుద్ధానికి వస్తాయి.. అంతేకాకుండా గాల్వన్ దగ్గర చైనా భారత్ బలాబలాలను వీడియో కాన్ఫరెన్స్లో ఎక్స్ప్లెయిన్ చేయడం.. ఇలా మన జోలికి వస్తే భయం ఎలా ఉంటుంది అన్నది వీడియో కాన్ఫరెన్స్ లో నే అజిత్ దోవల్ చూపించారు అని అంటున్నారు విశ్లేషకులు.