ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ వద్దు అని రాష్ట్ర  ప్రభుత్వం చెప్తుంటే ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్  మాత్రం ఎన్నికల నిర్వహణ మీద ఫోకస్ చేసారు. హైకోర్ట్ చెప్పింది అంటూ ఫిబ్రవరిలో ఎన్నికల నిర్వహణ మీద ఆయన కసరత్తులు చేస్తున్నారు. ఈ విషయంలో ఏపీ సర్కార్ చాలా సీరియస్ గా ఉంది. కరోనా కళ్ళకు కనపడటం లేదా అని ప్రశ్నలు వినపడుతున్నాయి. ఇక  ఇప్పుడు టీడీపీ మాత్రం కొన్ని డిమాండ్ లు తెర మీదకు తీసుకొచ్చింది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ కు టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు లేఖ రాసారు.

ప్రతిపక్ష నాయకులు, కార్యకర్తలపై వైసీపీ నేతల ఇష్టానుసారంగా దాడులకు పాల్పడుతున్నారు అని ఆయన లేఖలో ఆవేదన వ్యక్తం చేసారు. స్థానిక సంస్థల ఎన్నికలను ప్రజాక్షేత్రంలో ఎదుర్కొనలేక టీడీపీ అభ్యర్ధులను బెదిరింపులకు దిగుతున్నారు అని ఆయన లేఖలో పేర్కొన్నారు. సంతమాగులూరు మండలం కుందూరులో వైసీపీ శ్రేణులు కత్తులతో టీడీపీ అభ్యర్ధులపై దాడులకు పాల్పడ్డారు అని లేఖలో ఆయన వివరించారు. కుందూరు ఎంపీటీసీ అభ్యర్ధి రాఘవమ్మ భర్తపై హత్యాయత్నం చేశారు అని లేఖలో తెలిపారు.

స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసిన టీడీపీ అభ్యర్ధులే లక్ష్యంగా వైసీపీ శ్రేణులు దాడులకు బరితెగిస్తున్నారు అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా వైసీపీ నేతలు సృష్టించిన వీరంగంపై సీబీఐ విచారణ జరగాలి అని డిమాండ్ చేసారు.     దాడులు, దౌర్జన్యాలకు పాల్పడిన ప్రాంతాల్లో ఎన్నికలు వాయిదా వేయాలి అని కోరారు. ప్రతిపక్ష అభ్యర్ధులకు కేంద్ర భద్రతా దళాలతో రక్షణ కల్పించాలి అన్నారు. ఆన్ లైన్ లో నామినేషన్ ప్రక్రియ చేపట్టేందుకు ఏర్పాట్లు చేయాలి అని డిమాండ్ చేసారు. కేంద్ర భద్రతా దళాల సహకారంతో ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయాలి అని కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ శ్రేణులు అప్రజాస్వామిక, అనైతిక విధానాలకు పాలపడుతున్నారు అని విమర్శలు చేసారు. హత్యా రాజకీయాలతో ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తున్నారు అని మండిపడ్డారు. వైసీపీ నేతలు అనుసరిస్తున్న విధానాలతో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడింది అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: