మోడీ ఏడేళ్ల పాలన ఒక ఎత్తు ఇక ముందు జరిగేది మరో ఎత్తు గా ఉంటుందా. మోడీకి మొదటి టెర్ములో దక్కిన విజయాలు, రెండవ సారి రెండేళ్ల పాలనలో వరసగా వచ్చిన అపజయాలను బేరీజు వేసుకుని కొత్త రూట్లో వెళ్తున్నారా అంటే సమాధానం అవును అనే వస్తుంది.

మోడీ కేంద్ర మంత్రి వర్గాన్ని విస్తరించనున్నారు అన్న ప్రచారం అయితే ఢిల్లీ వర్గాల్లో చాలా  జోరుగా వినిపిస్తోంది. మోడీ కేవలం మంత్రి వర్గం కూర్పు మీదనే కొన్ని రోజులుగా కసరత్తు చేస్తున్నారు. మోడీ మంత్రి వర్గంలో పాతిక దాకా ఖాళీలు ఉన్నాయని అంటున్నారు. అలాగే కొంతమంది మంత్రుల పనితీరుని కూడా ఆయన బేరీజు వేసుకుంటున్నారు. దాంతో ఈసారి భారీ ఎత్తున మంత్రి వర్గ విస్తరణను పూర్తి చేయాలని భావిస్తున్నారుట. ఈ మేరకు మోడీ ఒక స్థిరమైన అభిప్రాయానికి వచ్చారని తెలుస్తోంది. అయితే మంత్రి వర్గం ఎలా ఉండాలి అన్నదే ఇక్కడ చర్చ.

మంత్రివర్గం కొత్తగా ఉండాలి, పనిమంతులు బాగా ఉండాలి అన్నది మొదటి నియమం. అదే విధంగా మంత్రుల విషయంలో యువతకు ప్రాధాన్యత ఇవ్వాలని కూడా నిర్ణయించారట. ఇక గతంలో భర్తీ కానీ శాఖలను నింపడంతో పాటు, ప్రాతినిధ్యం లేని రాష్ట్రాలకు కూడా అవకాశం ఇవ్వాలని మోడీ ఆలోచిస్తున్నారు అంటున్నారు. మొత్తానికి చూసుకుంటే మోడీ ఈసారి విస్తరణ మాత్రం ఒక వ్యూహం ప్రకారమే చేస్తారు అని వినిపిస్తోంది. రానున్న మూడేళ్లలో తన పాలనను పరుగులు తీయించడమే కాకుండా వచ్చే ఎన్నికల్లో గెలిచి తీరాలన్నది మోడీ మార్క్ పాలిటిక్స్ గా ఉందని టాక్. చూడాలి మరి కొత్తగా కేంద్రంలో చేరబోయే మంత్రులు ఎవరో. ఇదిలా ఉంటే చాలా మంది సెలిబ్రిటీలకు కూడా కేంద్ర మంత్రి వర్గంలో చోటు దక్కుతుంది అన్న ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి. వివిధ రంగాలకు చెందిన ప్రముఖులను మంత్రులుగా చేయడంతో పాటు వారి సేవలను ఉపయోగించుకుని ఆయా చోట్ల బీజేపీ జెండా పాతాలని కూడా చూస్తున్నారుట.


మరింత సమాచారం తెలుసుకోండి: