భారతీయ జనతా పార్టీలో ఉన్న కొంతమంది కీలక నాయకులు ఈ మధ్య కాలంలో ఆంధ్రప్రదేశ్ పర్యటనకు రావడం ఆంధ్రప్రదేశ్ లో ఉన్న సమస్యల గురించి ఎక్కువగా మాట్లాడటం అలాగే తెలుగుదేశం పార్టీని విమర్శించకుండా కేవలం అధికార పార్టీని విమర్శించడం వంటి అంశాలు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని కాస్త చిరాకు పెడుతున్న చెప్పాలి. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న సమయంలో వైసీపీ తో స్నేహం చేసిన భారతీయ జనతా పార్టీ ఇప్పుడు వైసీపీ అధికారంలో ఉండటంతో తెలుగుదేశం పార్టీతో స్నేహం చేసే ప్రయత్నం చేస్తోందని ఆరోపణలు ఎక్కువగా వినబడుతున్నాయి.
రాజకీయంగా పార్టీని కొన్ని కొన్ని అంశాల్లో ముందుకు నడిపించడానికి పార్టీలో ఉన్న కొంతమంది కీలక నాయకులను జగన్ ఈ మధ్యకాలంలో రంగంలోకి దిగడమే కాకుండా భారతీయ జనతా పార్టీ ని టార్గెట్ చేసే విధంగా కూడా ప్రయత్నాలు చేస్తున్నారని ప్రచారం జరుగుతోంది. పార్టీలో ఉన్న కొంతమంది కీలక నాయకులు ఈ మధ్య కాలంలో భారతీయ జనతా పార్టీ వైపు చూడటం అదే విధంగా భారతీయ జనతా పార్టీ నాయకులు కూడా వైసిపి నాయకులు ను తమ వైపు తిప్పుకునే ప్రయత్నాలు చేయడం వంటివి జగన్ లో చిరాకు కి కారణమయ్యాయని వైసీపీ నాయకులు అంటున్నారు.దీనిపై త్వరలో ఒక క్లారిటీ రానుంది.