1952 డిసెంబర్ 28న ఢిల్లీలో అరుణ్ జైట్లీ జన్మించారు. ఢిల్లీ యూనివర్సిటీ నుంచి అరుణ్ జైట్లీ న్యాయశాస్త్రంలో పట్టా పొందారు. విద్యార్థి దశలోనే ఆయన యూనివర్సిటీ స్టూడెంట్ యూనియన్ నాయకుడిగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత.. ఏబీవీపీలో చేరారు. క్యాంపస్ లో ఏబీవీపీ ప్రెసిడెంట్ గా పనిచేశారు. అనంతరం ఢిల్లీ ఏబీవీపీ అధ్యక్షుడిగా పనిచేశారు. కొంతకాలానికే.. ఢిల్లీ బీజేపీ యువమోర్చా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. అలా ఢిల్లీ బీజేపీలో అరుణ్ జైట్లీ క్రియాశీలకంగా వ్యవహరించారు. విద్యార్థి నాయకుడిగా, పార్టీ నేతగా, కేంద్రమంత్రిగా.. అరుణ్ జైట్లీ చేసిన సేవలు చిరస్మరణీయంగా గుర్తుండిపోతాయి.బీజేపీలో ఆయన వేసిన ముద్ర ఎన్నటికీ చెరగనిదిగా ఉంటుంది. కిడ్నీ సంబంధిత శస్త్రచికిత్స తర్వాత జైట్లీ ఆరోగ్యం మరింత క్షీణించింది. పరిస్థితి విషమించడంతో ఆయనను ఆస్పత్రిలో ఆగస్టు 9న ఎయిమ్స్ లో చేర్చారు. అప్పటి నుంచి ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు. ట్రీట్ మెంట్ జరుగుతుండగానే జైట్లీ మృతి చెందారు. ఆయనకు చికిత్స జరుగుతున్న టైంలో ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షా ఆస్పత్రికి వెళ్లి పరామర్శించారు.