ఏపీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డికి రెబ‌ల్ ఎంపీ ర‌ఘురామ‌రాజు వ‌రుస లేఖ‌లు రాస్తున్నారు.ఇప్ప‌టికే సీపీఎస్‌,వృద్ధాప్య పెన్ష‌న్ల‌పై లేఖలు రాయ‌గా తాజ‌గా మ‌రో లేఖ‌లు ర‌ఘురామరాజు జ‌గ‌న్‌కు రాశారు.ఈ సారి షాదీముబార‌క్‌, పెళ్లికానుక‌ల ప‌థ‌కాల‌పై లేఖ‌లో ప్ర‌స్తావించారు. ఎన్నిక‌ల స‌మ‌యంలో ఇచ్చిన హామీల‌ను
నెర‌వేర్చాలంటే లేఖ‌ల్లో ర‌ఘురామ‌రాజు ప్ర‌స్తావిస్తున్నారు.మేనిఫెస్టోలోని అంశాలు టార్గెట్‌గా ర‌ఘురామ‌రాజు సీఎం జ‌గ‌న్‌కు లేఖ‌లు రాస్తున్నారు.మొన్నటి వరకూ ఢిల్లీలో రచ్చబండతో జగన్ సర్కార్ ఇబ్బంది పెడితే...ఇప్పుడు ఆయ‌న రూట్ మార్చి లేఖాస్త్రాలు సంధిస్తున్నారు.మొత్తాన‌కి ర‌ఘురామ‌రాజు బెయిల్ వ‌చ్చిన త‌రువాత వైసీపీ ప్ర‌భుత్వాన్ని ప్రశ్నించ‌డం మాత్రం మాన‌లేద‌నేది స్ప‌ష్ట‌మ‌వుతుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: