గడిచిన కాలములో మానవుని చర్యల యొక్క అధ్యయనమే చరిత్ర. ఎన్నో విశేష‌ణ‌ల స‌మ‌హార‌మే చ‌రిత్ర‌. నాటి ఘ‌ట‌న‌లను..మాన‌వుడు న‌డిచి వ‌చ్చిన బాట‌ల‌ను స్మ‌రించుకోవ‌డానికే చ‌రిత్రే. ప్ర‌పంచ మాన‌వాళి ప‌రిణామ క్ర‌మంలో డిసెంబ‌ర్ 19వ ‌తేదీకి ఎంతో ప్రాధాన్యం ఉంది.  హెరాల్డ్ అందిస్తున్న ఆ విశేషాలు మీకోసం


ముఖ్య సంఘటనలు

1952: ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు చేయనున్నట్లు ప్రధానమంత్రి జవహర్‌లాల్ నెహ్రూ ప్రకటించాడు.
1961: భారత సైనిక దళాలు పోర్చుగీసు పాలన నుండి, గోవాను విముక్తి చేసాయి.
1978: ఇందిరా గాంధీని లోక్‌సభ నుండి బహిష్కరించి, అప్పటి సమావేశాలు ముగిసే వరకు ఆమెకు జైలుశిక్ష విధించారు. డిసెంబర్ 26 న ఆమెను విడుదల చేసారు.
1985: భారత లోక్‌సభ స్పీకర్‌గా రబీ రాయ్ పదవిని స్వీకరించాడు.
2009: భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ గడ్కరి నియమించబడ్డాడు.

ప్ర‌ముఖుల జననాలు

1903: కె.వి. గోపాలస్వామి, ఆంధ్ర విశ్వవిద్యాలయం మాజీ రిజిస్ట్రార్. (మ.1983)
1918: భాస్కరభట్ల కృష్ణారావు, రచయిత. (మ.1966])
1928: డి.వి.యస్.రాజు, తెలుగు సినిమా నిర్మాత.
1929: నిర్మలా దేశ్ పాండే, గాంధేయవాది. (మ.2008).భారతదేశం లోని ప్రముఖ సామాజిక కార్యకర్త, రాజ్యసభ సభ్యురాలు. ఈమె మహారాష్ట్ర లోని నాగపూర్లో జన్మించింది. ఆమె తండ్రి ప్రముఖ మరాఠి రచయిత పి.వై. దేశ్‌పాండే. వినోబా భావే ప్రారంభించిన భూదానోద్యమంలోనూ, భారత్-పాక్ శాంతి యాత్రలోనూ, టిబెట్ సమస్య పరిష్కారంలోనూ చురుగ్గా పాల్గొన్నది. జీవితాంతం గాంధేయ మార్గానికి కట్టుబడి అవివాహితురాలిగానే కొనసాగింది. సుమారు 60 సంవత్సరాలపాటు గాంధేయ భావాలతో కొనసాగి 2008, మే 1న ఢిల్లీలో 79వ యేట తుదిశ్వాస వదిలింది.
1935: రాజ్‌సింగ్ దుంగార్పుర్, మాజీ క్రికెట్ క్రీడాకారుడు, బి.సి.సి.ఐ.మాజీ అధ్యక్షుడు.
1977: హేమ. ఎమ్, రంగస్థల నటి.

ప్ర‌ముఖుల మరణాలు

1953: వనారస గోవిందరావు, శ్రీ శారదా మనో వినోదినీ సభ’ అనే నాటక సమాజాన్ని స్థాపించి, స్టేజి నాటకాలు వేయడం ప్రారంభించారు. ఆ సభే నేటి సురభి కంపెనీలకు మాతృసంస్థ.
1967: కొర్వి కృష్ణస్వామి ముదిరాజ్, హైదరాబాదు మాజీ మేయరు, రచయిత, పాత్రికేయడు, విద్యావేత్త, బహుముఖ ప్రజ్ఞాశీలి. (జ.1893)
2015: రంగనాథ్, విలక్షణ సినిమా నటుడు, కవి. (జ.1949)


పండుగలు , జాతీయ దినాలు

గోవా విముక్తి దినోత్సవం.

మరింత సమాచారం తెలుసుకోండి: