కోలీవుడ్ సెన్సేషనల్ బ్లాక్ బాస్టర్ మూవీ  అసురన్ ఇప్పుడు  తెలుగులో రీమేక్ అవుతున్న విషయం తెలిసిందే.  విక్టరీ వెంకటేష్  హీరో గా నటించనున్న ఈ చిత్రాన్ని సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు ఫేమ్  శ్రీకాంత్ అడ్డాల డైరెక్ట్ చేయనున్నాడు.   రేపటి నుండి  ఈ చిత్రం సెట్స్ మీదకు వెళ్లనుంది.  కాగా ఇప్పటివరకు కుటుంభ కథా చిత్రాలను తెరకెక్కించిన శ్రీకాంత్ అడ్డాల మొదటి సారి  పక్కా యాక్షన్ ఎంటర్ టైనర్ ను  డైరెక్ట్ చేస్తుండడం తో  ఈ రీమేక్ పై సర్వత్రా ఆసక్తి నెలకొంది.  ప్రముఖ తమిళ నిర్మాత కలై పులి ఎస్ తాను తో కలిసి సురేష్ బాబు నిర్మించనున్న ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందించనున్నాడు.  ఈచిత్రంలో వెంకీకి జోడిగా  ప్రియమణి నటించనుంది.

 
 ఇక ఈ చిత్రానికి టైటిల్  కూడా  ఫిక్స్ చేశారని వార్తలు వస్తున్నాయి. రూరల్ బ్యాక్ డ్రాప్ లో రివేంజ్ డ్రామాగా రానున్న ఈ చిత్రానికి నారప్ప అనే టైటిల్ ను పెట్టనున్నారట. త్వరలోనే ఈ టైటిల్ విషయంలో క్లారిటీ రానుంది.  ఈ ఏడాది మే లో  ఈ చిత్రాన్ని  విడుదలచేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.  ఇక ఒరిజినల్  వెర్షన్ లో  ధనుష్ , మలయాళ నటి మంజూ వారియర్ లీడ్ రోల్స్ లో నటించగా వెట్రి మారన్ డైరెక్ట్ చేశాడు.  గత ఏడాది విడుదలైన  ఈ చిత్రం 100 కోట్ల వసూళ్ల ను రాబట్టింది.  
 
ఇదిలా ఉంటే  ప్రస్తుతం వెంకీ  వరస విజయాల తో ఫుల్ ఫామ్ లో వున్నాడు.  అందులో భాగంగా గత  ఏడాది సంక్రాంతికి ఎఫ్ 2 తో వచ్చి చాలా కాలం తరువాత  బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టిన  ఈ సీనియర్ హీరో అదే ఏడాది చివర్లో  వెంకీ మామ తోవచ్చి సూపర్ హిట్ కొట్టాడు. మరి అసురన్ రీమేక్ తో వెంకీ  హ్యాట్రిక్ విజయాన్ని అందుకుంటాడో లేదో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: