ఇక దాని అనంతరం వీరిద్దరి కలయికలో వచ్చిన మూడో సినిమా అజ్ఞాతవాసి. రెండున్నర ఏళ్ల క్రితం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా భారీ అంచనాలతో రిలీజ్ అయి బాక్సాఫీసు దగ్గర మాత్రం పరాజయాన్ని మూటగట్టుకుంది. ఇకపోతే అతి త్వరలో వీరిద్దరి కాంబినేషన్లో మరో సినిమా రాబోతోంది అంటూ కొద్ది రోజులుగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే కెరీర్ పరంగా వరుసగా సినిమాలు చేసుకుంటూ కొనసాగుతున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రెండు రోజుల క్రితం తన తదుపరి సినిమాని సాగర్ చంద్ర దర్శకత్వంలో చేయనున్నట్లు ప్రకటించారు. ఇటీవల మలయాళం లో రిలీజ్ అయి సూపర్ హిట్ కొట్టిన అయ్యప్పన్ కోషియం సినిమా తెలుగు రీమేక్ గా తెరకెక్కనున్న ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ ఒక పోలీస్ ఆఫీసర్ పాత్ర పోషించనున్నారు.
వాస్తవానికి ఈ సినిమాకు త్రివిక్రమ్ దర్శకత్వం వహించాల్సి ఉందని టాక్. అయితే ముందుగా ఈ సినిమా కథను తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా యువ దర్శకుడు శేఖర్ చంద్ర మార్చడం, అలానే దానిని పవన్ కళ్యాణ్ కు వినిపించడం జరిగిందని, అయితే అతను చెప్పిన కథా విధానం విని ఎంతో బాగా నచ్చిన త్రివిక్రమ్, అతడే ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తే బాగుంటుందని సూచించడం జరిగిందట. అయితే త్రివిక్రమ్ చెప్పిన దాంట్లో కొంత ఆంతర్యం ఉందని ఎందుకంటే ఇప్పటికే తాను పవన్ కోసం తీసే సినిమాకు సంబంధించి ఒక స్టోరీ సిద్ధం చేసుకోవడంతో, ఒకవేళ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తే తన సినిమాను వాయిదా వేయాల్సి వస్తుందని భావించిన త్రివిక్రం దానిని సాగర్ కి అప్పగించారని అంటున్నారు. ఒకరకంగా దీనితో ఆ సినిమాకు దర్సకత్వం వహించాలన్న శేఖర్ లైన్ క్లియర్ అవడంతో పాటు ఇటు త్రివిక్రమ్ లైన్ కూడా క్లియర్ అయిందని, ఇక అతి త్వరలో పవన్, త్రివిక్రమ్ ల కాంబినేషన్ సినిమా గురించి అధికారికంగా ప్రకటన రానుందని అంటున్నారు. మొత్తంగా తన స్నేహితుడైన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ విషయంలో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ ప్లానింగ్ నిజంగా అదుర్స్ అంటున్నారు ప్రేక్షకులు.....!!