పిల్లవాడు వరుణ్ మాత్రం తన తల్లి కొంగు నుండి విడిపించుకుని వెళ్ళి పోయాడు. వెంటనే వరుణ్ రా తాత అని గట్టిగా అరిచాడు పరిగెత్తుకుంటూ తన తాత ముని రత్నం వద్దకు వచ్చాడు. అమ్మ, పాప నీటి లో దూకేస్తున్నారు రండి అని గట్టిగా అరుస్తూ అందరినీ పిలిచాడు. ఇలా వరుణ్ పిలవడం తో వరుణ్ వాళ్ళ తాత స్థానికులను, మనవడిని వెంట బెట్టుకొని పరుగున ఆ వృద్ధుడు గ్రామస్తుల తో కలిసి కోనేటి వద్దకు వెళ్లే సరికి కృష్ణవేణి తన కుమార్తె తో సహా విగతజీవులై ఉన్నారు.
ఇంకేం చెయ్యలేని పరిస్థితి. అప్పటికే ఆమెని కాపాడ లేకపోయారు. కుటుంబ కలహాల కారణంగా ఈమె ఇలా ఆత్మహత్య చేసుకోవడం ఘోరం. ఈ ఘటన నిజంగా స్థానికులను కలచి వేసింది . పోలీసులు సమాచారం అందుకుని ఆ ఘటనా స్థలానికి వెళ్లి జరిగిన దానిని పరిశీలిస్తున్నారు. అలానే ఆత్మహత్యకి గల కారణాలను కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు.