తెలుస్తున్న సమాచారం ప్రకారం తెలంగాణలోని నిజామాబాద్ జిల్లాలో మూడు చోట్ల దొంగతనాలు జరిగాయని తెలుస్తోంది. దీనితో పోలీసులు అందరూ అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. ఈ దొంగలు కూడా ఎంతో ప్రణాళికతో దొంగతనాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ దొంగలు కూడా ఊరికి వెళ్తున్న వారి ఇళ్లనే లక్ష్యంగా చేసుకుని దొంగతనం చేస్తున్నారు.
ఇలా జరగకుండా ఉండాలంటే కొన్ని ముఖ్యమైన జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసులు తెలియ చేస్తున్నారు.
* మీరు ఊరికి వెళ్లే సమయంలో ఆ విషయాన్ని పక్కింటి వారికి చెప్పి వెళ్ళండి. ఒక వేళ మీరు లేని సమయంలో ఎవరైనా వచ్చినట్లు తెలిస్తే వారు వెంటనే పోలీసులకు సమాచారం ఇస్తారు.
* మీ ఇంటి చుట్టు పక్కల రోడ్ల మీద తిరుగుతూ అనుమానంగా కనిపిస్తే వెంటనే పోలీసులకు తెలియ చేయండి.
* మీ ఇంట్లో విలువైన వస్తువులు ఉన్నట్లయితే ఖచ్చితంగా పోలీసులకు తెలియచేసి వెళ్ళండి.
ఇలా పలు జాగ్రత్తలు తీసుకుంటే దొంగల బారి నుండి రక్షింపబడవచ్చు. కాబట్టి ఊరికి వెళ్లే వారు అన్ని విధాలుగా జాగత్తలు తీసుకోండి.