టాలీవుడ్ బ్యూటిఫుల్ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ క్రేజ్ గురించి మనందరికీ తెలిసిందే. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ అద్భుతమైన సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. అయితే గత ఏడాది కార్తికేయ టు సినిమాతో బ్లాక్ బస్టర్ విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది ఈ బ్యూటీ. ఇక ఈ సినిమా కేవలం తెలుగులోనే కాకుండా ఇతర భాషల్లో కూడా విడుదలై అక్కడ కూడా మంచి టాక్ తెచ్చుకున్నాయి. అయితే తాజాగా ఈమె నటించిన మరొక బ్లాక్ బస్టర్ సినిమా టిల్లు స్క్వేర్. ఇక ఈ సినిమా ఎంతటి విజయాన్ని అందుకుందో మనందరికీ తెలిసిందే .దాదాపుగా 125 కోట్లకు పైగానే వసూళ్లను రాబట్టింది ఈ సినిమా. ఈ సినిమా హిట్తో ఈ

 ముద్దుగుమ్మకి ప్రస్తుతం వరుస సినిమా అవకాశాలు వస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే అనుపమ పరమేశ్వరన్ ఏకంగా ఐదు సినిమాల చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా సమాచారం వినబడుతుంది .ఇక ఆ సినిమాలో ఏంటో మనం కూడా ఒక లుక్కేద్దాం. అయితే ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ హనుమాన్ దర్శకుడు ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో ఆక్టోపస్ వర్కింగ్ టైటిల్ తో ఒక సినిమా చేస్తోంది. ఈ సినిమాతో పాటు మరికొన్ని సినిమాలు కూడా చేస్తోంది. ఈ సినిమాతో పాటు బండి సరోజ్ కుమార్ డైరెక్షన్లో పరదా సినిమాలోని నటిస్తుంది. ఈ మూవీకి సంబంధించిన టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ కొన్ని రోజుల క్రితం రిలీజ్

 చేయగా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇకపోతే టాలీవుడ్ లోనే కాక తమిళ్లోనే అవకాశాలు దక్కించుకుంటుంది. ప్రస్తుతం తమిళ్ లో పెట్ డిటెక్టివ్ అనే సినిమాతో నటిస్తుంది. సినిమాపై ప్రేక్షకుల మంచి అంచనాలు ఉన్నాయి. అలానే ధృవ్ విక్రమ్ హీరోగా నటిస్తున్న సెల్వరాజ్ డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న బైసన్ సినిమాలోని ఈమె నటిస్తుంది. లాక్ డౌన్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది.  ఇలా ఈ బ్యూటీ ప్రస్తుతం చేతి నిండా సినిమాల్లో నటిస్తూ బిజీగా గడుపుతుంది. దీంతో ప్రస్తుతం ఈ బ్యూటీ చేస్తున్నారు సినిమాల కోసం వెయిట్ చేస్తున్నారు ఆమె అభిమానులు అయితే కేవలం తెలుగులోనే కాకుండా ఇతర భాషల్లో కూడా సినిమాలు చేస్తూ బిజీగా ఉంది ఈ ముద్దుగుమ్మ. ఇకపోతే ఈమె సినిమాలతోనే కాకుండా సోషల్ మీడియాలో సైతం తరచూ ఆక్టివ్ గా ఉంటుంది. తనకి సంబంధించిన ఫోటోలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ తన అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది..!!

మరింత సమాచారం తెలుసుకోండి: