ఆంధ్రప్రదేశ్లోని ఎన్నికలు మరో మూడు రోజులలో జరగబోతున్న సమయంలో సరి కొత్త ట్విస్టులు  సైతం కనిపిస్తూ ఉన్నాయి.. ఈ క్రమంలోనే పార్టీ అధినేతలందరూ కూడా పెద్ద ఎత్తున పలు రకాల ప్రచార కార్యక్రమంలో కూడా పాల్గొంటున్నారు.. ఇప్పుడు తాజాగా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కు తన మాజీ అల్లుడు గట్టు షాక్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది.. నాగబాబు మాజీ అల్లుడు జొన్నలగడ్డ చైతన్య ఆంధ్రప్రదేశ్ రాజకీయాల గురించి పలు వ్యాఖ్యలు చేసినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.


గతంలో జొన్నలగడ్డ చైతన్య ,నిహారిక వివాహం జరిగిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత కొన్ని కారణాల చేత విడాకులు కూడా తీసుకున్నారు. ఈ క్రమంలోనే మెగా ఫ్యామిలీ గురించి ఆయన మాట్లాడుతూ చేసిన వాక్యాలు పెను సంచలనాలను సృష్టిస్తున్నాయి. జనసేన పార్టీకి అసలు ఎవరు ఓటు వేయవద్దండి అంటూ కోరుకుంటున్నారు.. కేవలం స్వార్థ రాజకీయాల కోసమే ఈ మెగా ఫ్యామిలీ ఎంతకైనా తెగిస్తుంది అంటూ వెల్లడించారు.. ప్యాకేజీ కోసం ఎంతకైనా దిగజారుతుందని జనసేన సిద్ధాంతాలకు పవన్ కళ్యాణ్ అసలు పాటించారని కూడా తెలియజేశారు.


పవన్ మాట్లాడే మాటలకు చేష్టలకు ఎలాంటి పోలిక ఉండదంటూ కూడా వెంకట చైతన్య ఆరోపిస్తున్నట్లుగా సమాచారం.. పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్న పిఠాపురంలో ఎంతో మంది ఆర్టిస్టులు ప్రచారం చేస్తూ ఉంటే వారందరూ కూడా కేవలం భయంతోనే ప్రచారం చేస్తున్నారని తెలియజేశారు. మెగా కుటుంబం మొత్తం చంద్రబాబు నాయుడు కనుసైగల్లోనే పనిచేస్తుందని ప్రచారానికి రాకపోతే తమకు అవకాశాలు దక్కనివ్వకుండా చేస్తారని ఆర్టిస్టులు భయంతోనే ఇలా వస్తున్నారని జనసేనను నమ్మి ప్రజలు మోసపోకండి అంటూ వెంకట చైతన్య తెలియజేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు రాజకీయాలలో జొన్నలగడ్డ చేసిన ఈ వాక్యాలు సైతం వైరల్ గా మారుతున్నాయి.. మరి చైతన్య మాటలు జనసేన పార్టీ పైన ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తాయో చూడాలి మరి..

మరింత సమాచారం తెలుసుకోండి: