ధోనీ గతంలో ఒత్తఃయిన జుట్టుతో జులపాలుగా వేలాదీసుకుని అతడు
మైదానంలో పరిగెడుతూ వస్తుంటే శివుడు జుట్టు విదిల్చి తాండవం చేస్తున్నాడా
అనేట్టుగా ఉండేది ఎప్పటికప్పుడు కొత్తరకమైన
హెయిర్ స్టైల్ తో ఉండే ధోనీని అభిమానులే కాదు ఎంతో మంది అనుసరించే వాళ్ళు
కూడా..అయితే ఇంగ్లాండ్ సీరీస్ లో భాగంగా టీమిండియా మాజీ కెప్టెన్ ధోనీ తెల్ల గడ్డంతో కనిపించాడు. కానీ, వన్డే సిరీస్ అనంతరం ధోని క్లీన్ షేవ్తో ఉన్న ఓ ఫొటో సోషల్
మీడియాలో వైరల్ అయ్యింది...వివరాలలోకి వెళ్తే..
భారత స్పీనర్ అక్షర్ పటేల్ ధోనితో కలిసి దిగిన ఫొటోను తన ట్వీటర్ అకౌంట్లో పోస్టు చేశాడు..అయితే ధోనీ తెల్లగడ్డం మాత్రం అభిమానులకు అంతగా అస్సలు నచ్చలేదని. ఈ విషయంపై క్రికెటర్ గౌతమ్ గంభీర్ కూడా ధోని గడ్డంపై మాట్లాడిన విషయం తెలిసిందే. అంతేకాక తెల్లగడ్డాన్ని తొలగించండి అని ఇటీవల సలహా ఇచ్చాడు గౌతమ్...ఇదిలాఉంటే
టీ20..వన్డే సిరీస్ తర్వాత ధోని ఇంటికి చేరుకున్నాడు అయితే సెలక్షన్ కమిషన్ ఎంపిక చేసిన టెస్టు జట్టులో అక్షర్ పటేల్, శ్రేయస్ అయ్యర్, శార్దూల్లకు స్థానం దక్కకపోవడంతో వారు కూడా ఇండియాకు వచ్చేశారు. ఈ సందర్భంగా ఆ యువ ఆటగాళ్లు ధోనితో కలిసి కొన్ని ఫోటోలు దిగారు..ఈ ఫొటోలో ధోని క్లీన్ షేవ్తో ఉన్నాడు. దీంతో అభిమానులు సంతోషంతో తెల్లగడ్డం తీసేశాడని కామెంట్స్ పెడుతున్నారు..అంతేకాదు ధోనీ ఇక తెల్లగెడ్డం పెంచవద్దు అంటూ కామెంట్స్ చేస్తున్నారు కూడా ఈ ఫోటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి..