తమిళ సినిమా ఇండస్ట్రీ లో స్టార్ హీరో లలో ఒకరిగా కొనసాగుతున్న తలపతి విజయ్ ఇప్పటికే ఈ సంవత్సరం నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన బీస్ట్ మూవీ తో ప్రేక్షకులను పలకరించాడు. ఈ మూవీ లో తలపతి విజయ్ సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటించగా , అనిరుద్ రవిచంద్రన్ ఈ మూవీ కి సంగీతాన్ని అందించాడు. భారీ అంచనాల నడుమ ఏప్రిల్ 13 వ తేదీన తమిళ్ తో పాటు తెలుగు , కన్నడ , మలయాళం , హిందీ భాషల్లో భారీ ఎత్తున విడుదల అయిన బీస్ట్ మూవీ బాక్సా ఫీస్ దగ్గర ప్రేక్షకులను కాస్త నిరాశపరిచింది.

ఇలా బీస్ట్ మూవీ తో ఇప్పటికే ఈ సంవత్సరం ప్రేక్షకులను పలకరించిన తలపతి విజయ్ ప్రస్తుతం వంశీ పైడిపల్లి దర్శకత్వంలో దిల్ రాజు బ్యానర్ లో తెరకెక్కుతున్న మూవీ లో హీరోగా నటిస్తున్నాడు. ఈ మూవీ లో రష్మిక మందన హీరోయిన్ గా నటిస్తూ ఉండగా , తమన్మూవీ కి సంగీతాన్ని అందిస్తున్నాడు. ఈ మూవీ తమిళ్ లో వరిసు అనే టైటిల్ తో తెరకెక్కుతూ ఉండగా ,  తెలుగు లో వారసుడు అనే టైటిల్ ఠీ తేరకెక్కుతుంది.

ఇప్పటికే ఈ మూవీ నుండి చిత్ర బృందం కొన్ని పోస్టర్ లను విడుదల చేయగా వాటికి ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ లభించింది. ఈ మూవీ ని వచ్చే సంవత్సరం సంక్రాంతి కానుకగా విడుదల చేయనున్నట్లు మూవీ యూనిట్ ఇప్పటికే అధికారికంగా ప్రకటించింది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కు సంబంధించిన ఒక వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ మూవీ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ను విజయ్ ఇండస్ట్రీ లోకి వచ్చి 30 ఏళ్లు అయ్యే సమయానికి ఏర్పాటు చేయాలని మూవీ యూనిట్ చూస్తున్నట్లు తెలుస్తోంది. దానితో ఈ మూవీ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ డిసెంబర్ మొదటి రెండు వారాల్లో జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: