బాలీవుడ్ లో ప్రముఖ దర్శకులు సంజయ్ లీలా బన్సాలీ ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన చిత్రం ‘పద్మావతి’. ఈ సినిమా షూటింగ్ మొదలైనప్పటి నుంచి ఎన్నో అవాంతరాలు ఏర్పడుతూనే ఉన్నాయి. ఇక సినిమా పూర్తి చేసుకొని రిలీజ్ చేయాలని సిద్దం అవుతున్న సమయంలో ‘పద్మావతి’లో తమ మనోభావాలు దెబ్బతినేలా ఉందని కర్ణిసేన అభ్యంతరాలు తెలుపుతూ నిరసనకారుల ఆందోళనలు, పలు రాష్ట్ర ప్రభుత్వాలు మూవీపై నిషేధం విధించడంతో సినిమా రిలీజ్ను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్టు నిర్మాతలు ప్రకటించారు.
వాస్తవానికి ఈ నెల 1న రిలీజ్ కావాల్సి ఉన్నా సినిమా వాయిదా వేయడంతో అభిమానులు ఒకింత నిరాశకు లోనయ్యారు. మరోవైపు గుజరాత్ లో ఎలక్షన్లు జరుగుతన్న నేపథ్యంలో గొడవలు కాకుండా అన్ని రకాలుగా చర్యలు తీసుకుంటున్నారు..ఇందులో భాగంగా పద్మావతి చిత్రాన్ని కూడా ఆపివేసిన విషయం తెలిసిందే. దీంతో గుజరాత్ ఎలక్షన్స్ తర్వాత సినిమా రిలీజ్ చేయాలని ఆలోచనలో ఉన్నారు చిత్ర యూనిట్.
ఈలోగా సీబీఎఫ్సీ స్పందన వెల్లడయ్యే అవకాశం ఉంది.ఎన్నికలు పూర్తయి, సీబీఎఫ్సీ సర్టిఫికేషన్ రాగానే ప్రపంచవ్యాప్తంగా పద్మావతిని అత్యధిక స్క్రీన్లలో విడుదల చేసేందుకు నిర్మాతలు ప్రయత్నిస్తున్నట్టు సమాచారం. అయితే జనవరి మొదటి వారం, రెండోవారం ఎప్పుడైనా విడుదల చేయడానిక సన్నాహాలు చేస్తున్నారట.