సినిమా ఇండస్ట్రీలో వారసుల జోరు బాగా పెరిగిపోయింది..భారతీయ చలన చిత్ర రంగంలో అందాల తార..అతిలోక సుందరి శ్రీదేవి అనుకోకుండా దుబాయ్ లో అకాల మరణం పొందారు. ఆమె మరణం యావత్ భారత సినీ ప్రియుల హృదయాలు కలచి వేసింది. అయితే శ్రీదేవి బాలనటిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఆమె బాలీవుడ్ లో కి వెళ్లిన తర్వాత బోని కపూర్ ని వివాహం చేసుకుంది..వీరికి ఇద్దరు పిల్లలు..జాన్వి కపూర్, ఖుషీ కపూర్. అయితే శ్రీదేవి చాలా కాలం సినిమాలకు దూరంగా ఉన్న విషయం తెలిసిందే.
ఇంగ్లీష్ వింగ్లీష్ సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చిన శ్రీదేవి తన పెద్ద కూతురు జాన్వికపూర్ ని హీరోయిన్ గా చూడాలని తెగ ప్రయత్నాలు చేసింది. ఈ నేపథ్యంలో కరణ్ జోహార్ నిర్మాతగా ‘ధడక్’ సినిమాతో జాన్వికపూర్ ని హీరోయిన్ గా పరిచయం చేశారు. అయితే సినిమా రిలీజ్ సమయానికి శ్రీదేవి మరణించారు. తాజాగా ఇప్పుడు కరణ్ జోహార్ నటి శ్రీదేవి రెండో కూతురు ఖుషీ కపూర్ ని కూడా హీరోయిన్ గా పరిచయం చేయడానికి సిద్దమైనట్లు సమాచారం. బాలీవుడ్ బాద్ షా షారూఖ్ ఖాన్ ముద్దుల తనయుడు ఆర్యన్ ఖాన్ పక్కన ఖుషీ కపూర్ ని ఇంట్రడ్యూస్ చేయబోతున్నట్లు బాలీవుడ్ లో హాట్ టాపిక్ అయ్యింది.
ఖుషి కాస్త ముందుగానే కెరీర్ ప్రారంభించబోతోంది. కరణ్ జోహార్ ఆమెను పరిచయం చేయనున్నారు. బోనీ కపూర్ నుంచి కరణ్ ఆ బాధ్యతల్ని తీసుకున్నారు. ఆమెకు సరిపోయే స్క్రిప్ట్ కోసం చూస్తున్నారు’ అని బోనీ కపూర్ కుటుంబ సన్నిహితులు చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి.
‘ధడక్’ సినిమాలో అద్భుత నటన కనబరిచిన జాన్వీ కపూర్ సినీ ప్రముఖులు, అభిమానుల ప్రశంసలు అందుకుంటోంది. ఇక బాలీవుడ్ హీరో షారుక్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ కూడా తెరంగేట్రం చేయనున్నాడని కొద్ది రోజులుగా ముమ్మర ప్రచారం జరుగుతోంది. తాజాగా ఆర్యన్, ఖుషి జోడీగా నటించే అవకాశం ఉందనే వార్తలు ఇంటర్నెట్లో వైరల్ అయ్యాయి.