తెలుగు ఇండస్ట్రీలో వెంకటేష్ హీరోగా నటించిన కూలీ నెం.1 చిత్రంతో హీరోయిన్ గా పరిచయం అయిన టబు తర్వాత కృష్ణవంశి దర్శకత్వంలో నాగార్జున నటించిన ఫ్యామిలీ ఎంట్రటైన్ మెంట్ చిత్రం నిన్నే పెళ్లాడుతా చిత్రంతో స్టార్ హీరోయిన్ గా మారిపోయింది టబు.  బాలీవుడ్ లో 1980 లో బాలనటిగా ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ తెలుగు లో వరుస అవకాశాలు దక్కించుకొని నెంబర్ వన్ రేస్ లోకి వెళ్లిపోయింది. 

ఆ తర్వాత బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన టబు అక్కడే స్థినపడిపోయింది.  అప్పుడప్పుడు తెలుగు, తమిళ చిత్రాల్లో నటిస్తున్న ఈ బ్యూటీ నటించిన అంధ‌ధున్ ఏకంగా వంద రోజులు ఆడ‌టమే కాకుండా అనేక అవార్డులు కూడా స్వంతం చేసుకుంది. హిందీ, తెలుగు, తమిళ్, ఇంగ్లీష్ త‌దిత‌ర భాషా చిత్రాల్లో నటించిన టబు వయసు ఇప్పుడు 47 సంవత్సరాలు.

ఇప్పటి వరకు వివాహం చేసుకోకుండా కుమారిగానే ఉంటుంది. తాజాగా ఆమె త‌న ఇన్ స్టా గ్రామ్ లో ఒక ఫోటోను పోస్ట్ చేసింది.. ఆ ఫోటోలో ఆమె వ‌య‌సు ఏకం గా 25 ఏళ్లు త‌గ్గిన‌ట్లుగా క‌నిపిస్తున్న‌ది. ఇంత వయసు వచ్చినా ఈ ముదురు భామ ఇంకా గ్లామర్ మెయింటేన్ చేయడం నిజంగా అభిమానులను ఆశ్చర్యపరుస్తుంది.  వయ‌సు పెరుగుతున్నా గ్లామ‌ర్ ను కాపాడుకోవ‌డంలో ట‌బు తొలి వ‌రుస‌లో ఉంద‌నే చెప్పాలి.



మరింత సమాచారం తెలుసుకోండి: