ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ప్రజలకు బిగ్ అలర్ట్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో కొత్త జిల్లా ఏర్పాటు కాబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఆ దిశగా సీఎం చంద్రబాబు నాయుడు అడుగులు వేస్తున్నట్లు చెబుతున్నారు. త్వరలోనే కొత్త జిల్లాను ఏర్పాటు చేయబోతున్నారట. ఈ మేరకు తాజాగా ఏపీ కేబినెట్లో కూడా చర్చ జరిగినట్లు వార్తలు వస్తున్నాయి. ఏపీలో ఉన్న మార్కాపురం ను కొత్త జిల్లాగా ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తోంది. కొన్ని సంవత్సరాలుగా మార్కాపురం జిల్లా చేయాలని అక్కడి ప్రజలు డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే.

 అయితే 2024  మొన్నటి అసెంబ్లీ ఎన్నికల సమయంలో సీఎం చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు. గ్రామ అధికారంలోకి వస్తే మార్కాపురం  ను ఖచ్చితంగా జిల్లా చేసి తీరుతామని ప్రకటించారు. అయితే ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు సీఎం చంద్రబాబు నాయుడు అడుగులు వేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. మంగళవారం రోజున ఏపీ జేబినెట్ సమావేశం జరిగిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ప్రత్యేకంగా మార్కాపురం జిల్లా డిమాండ్ పైన చర్చించారు సీఎం చంద్రబాబు.

 అయితే మార్కాపురం జిల్లా ఏర్పాటుపై సాధ్యసాద్యాలను పరిశీలించాలని అధికారులకు అలాగే... మంత్రులకు కీలక ఆదేశాలు ఇచ్చారు సీఎం చంద్రబాబు. ప్రస్తుతం మార్కాపురం మండలమే కాకుండా రెవెన్యూ డివిజన్ రావడం గమనార్హం. ప్రస్తుతం మార్కాపురం... ప్రకాశం జిల్లాలో ఉన్న సంగతి తెలిసిందే. ఈ మార్కాపురంలో పలకలు ఎక్కువగా ఉత్పత్తి చేస్తారు. జనాభా కూడా విపరీతంగానే ఉంటుంది.  కొన్ని సంవత్సరాలుగా జిల్లా ఏర్పాటు చేయాలని డిమాండ్ ఉంది. అందుకే చంద్రబాబు నాయుడు కూడా ఆ దిశగా అడుగులు వేస్తున్నారు.



వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ : వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: