
అయితే బౌలర్లు పరవాలేదు అనిపిస్తున్నప్పటికీ అటు బ్యాట్స్మెన్లు మాత్రం తీవ్రంగా నిరాశ పరుస్తూ ఉన్నారు అని చెప్పాలి. కీలకమైన సమయంలో చేతులెత్తేస్తూ ఉన్నారు. మొన్నటి వరకు ఐపీఎల్ లో సెంచరీల మోత మోగించిన కోహ్లీ, గిల్ లు సైతం తక్కువ పరుగులకే వికెట్ కోల్పోవడం.. ఇక మరోవైపు ఆస్ట్రేలియా బ్యాట్స్మెన్లు భారీగా పరుగులు చేస్తున్న నేపథ్యంలో ఇక టీమ్ ఇండియాకు విజయం క్రమక్రమంగా దూరం అవుతుంది అని చెప్పాలి. ఇదిలా ఉంటే ఇక టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అందరు ఊహించినట్లుగా బ్యాటింగ్ ఎంచుకోకుండా ఫీల్డింగ్ ఎంచుకోవడం గురించి కూడా విమర్శలు వస్తున్నాయి అని చెప్పాలి.
ఇకపోతే ఇదే విషయంపై ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ స్టీవ్ వా స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 2019లో యాషెష్ సిరీస్ లో కూడా ఆస్ట్రేలియా చేసిన పొరపాటు ఇక ఇప్పుడు భారత్ చేసింది అంటూ చెప్పుకొచ్చాడు. ఆ మ్యాచ్ లో ఇంగ్లాండ్ పై ఆస్ట్రేలియా కెప్టెన్ టీం ఫైన్ టాస్ గెలిచాడు. కానీ బ్యాటింగ్ ఎంచుకోవాల్సింది బౌలింగ్ ఎంచుకున్నాడు అంటూ గుర్తు చేశాడు. చివరికి మ్యాచ్లో ఇంగ్లాండ్ 145 పరుగులు తేడాతో విజయం సాధించింది అంటూ తెలిపారు. అంతే కాకుండా భారత్ తుది జట్టు ఎంపిక కూడా సరిగ్గా లేదు అంటూ స్టివ్ వా అభిప్రాయం వ్యక్తం చేశాడు.