సూపర్ స్టార్ మహేష్ తో పరశురామ్ పెట్ల తీస్తున్న సర్కారు వారి పాట మూవీ ఈ ఏడాది వేసవి కానుకగా మే 12న రిలీజ్ కానున్న విషయం తెలిసిందే. మైత్రి మూవీ మేకర్, జిఎంబి ఎంటర్టైన్మెంట్స్, 14 రీల్స్ ప్లస్ సంస్థలు నిర్మిస్తున్న ఈ సినిమాలో మహేష్ కి జోడీగా కీర్తి సురేష్ నటిస్తుండగా థమన్ సంగీతం అందిస్తున్నారు. అందరిలో భారీ అంచనాలు ఏర్పరిచిన ఈ సినిమా నుండి ఇప్పటికె రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ బ్లాస్టర్ టీజర్ అందరినీ ఆకట్టుకుంది.

మది ఫోటోగ్రాఫర్ గా పని చేస్తున్న సర్కారు వారి పాటలో సముద్రఖని విలన్ గా చేస్తుండగా సుబ్బరాజు, ప్రియదర్శి, వెన్నెల కిషోర్ తదితరులు ఇతర పాత్రలు చేస్తున్నట్లు టాక్. ఇక ఈ మూవీ నుండి కళావతి పల్లవితోసాగే ఫస్ట్ సాంగ్ ప్రోమో ని నిన్న యూట్యూబ్ లో రిలీజ్ చేసింది యూనిట్. సూపర్ స్టార్ సూపర్ ట్రెండీ స్టైల్ లో ఉన్న ఆ సాంగ్ లో హీరోయిన్ కీర్తి సురేష్ కూడా ఎంతో అందంతో మెరిసిపోయింది. దానితో ఫుల్ సాంగ్ పై అందరిలో మంచి అంచనాలు ఏర్పడ్డాయి. థమన్ మెలోడియస్ గా స్వరపరిచిన ఈ సాంగ్ ని సిద్ శ్రీరామ్ ఆలపించారు. కాగా ఈ సాంగ్ ఫుల్ లిరికల్ వీడియోని ఎల్లుండి ప్రేమికుల దినోత్సవం సందర్భంగా రిలీజ్ చేయనున్న యూనిట్ కి నేడు ఒక్కసారిగా పెద్ద ఎదురు దెబ్బ తగిలింది.

కాగా కళావతి ఫుల్ సాంగ్ కొద్దిసేపటి క్రితం పలు సోషల్ మీడియా మాధ్యమాల్లో లీక్ అయి  విపరీతంగా వైరల్ అవుతున్నట్లు సమాచారం. మరోవైపు సాంగ్ లీక్ పై సూపర్ స్టార్ ఫ్యాన్స్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ నిర్మాతలపై సోషల్ మీడియాలో విరుచుకుపడుతూ కామెంట్స్ చేస్తున్నారు. గతంలో ఈ మూవీ టీజర్ కూడా ఇలానే లీక్ అయిందని, ఇప్పుడు పాట కూడా లీక్ కావడంతో అసలు ప్రొడక్షన్ టీమ్, నిర్మాతలు ఏమి చేస్తున్నారు అని పలువురు ప్రేక్షకులు, అభిమానులు సైతం ప్రశ్నిస్తూ కామెంట్స్ చేస్తున్నారు. మరి దీనిపై సర్కారు వారి పాట నిర్మాతలు స్పందిస్తారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: