•ముగిసిన ప్రచార జోరు
• మొదలైన ప్రలోభాల హోరు
 •విజయం సాధించేది ఎవరు.?


ఇంకా మూడు రోజుల్లో ఎలక్షన్స్..ఇప్పటికే  నాయకులంతా గత కొన్ని నెలల నుంచి నియోజకవర్గాల్లో తిరిగి  తిరిగి, ప్రస్తుతం సైలెంట్ అయిపోయారు. ఇన్ని రోజులు గల్లీల నుంచి పట్టణాల వరకు మోగినటువంటి మైకులు ఆగిపోయాయి. ఎక్కడ చూసినా మొత్తం సైలెంట్ గా ప్రచారం నడుస్తోంది. ఈ క్రమంలోనే ప్రజలకు ఏదో ఒక విధంగా డబ్బు ప్రలోభం చేస్తూ ఓట్లను కొనే ప్రయత్నంలో ఉన్నారు నేతలంతా. ప్రస్తుతం పార్టీలో పనిచేసే కిందిస్థాయి నాయకులకు, కార్యకర్తలకు డబ్బాందేది ఇప్పుడే..  ఇన్ని రోజులు కష్టపడ్డారు. ప్రస్తుతం డబ్బు చేతిలోకి వచ్చేసరికి  వారి మనసు మారుతుందట.. కొన్ని నియోజకవర్గాల్లో అభ్యర్థులు ఎలాగైనా గెలవరని భావించి  చాలామంది నేతలు వచ్చిన డబ్బును ప్రజలకి పంచకుండా వారి దగ్గరే ఉంచేసుకుంటున్నారని తెలుస్తోంది. అలాంటి వాటిలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ప్రకాశం జిల్లాలోని ఒంగోలు పార్లమెంటు పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల్లో వైసీపీకి దిక్కుతోచని పరిస్థితి ఏర్పడిందట. 


ఎన్నికలకు వారం రోజుల ముందు నుంచే నోట్ల కట్టలకు పని చెప్పిన వైసిపి  అభ్యర్థులకు ఎక్కడికి వెళ్లినా ఓటర్లు  చుక్కలు చూపిస్తున్నారని తెలుస్తోంది. ఇక ఒంగోలు పార్లమెంటులో పోటీ చేస్తున్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఓడిపోతానని ముందుగానే గ్రహించి డబ్బు ఎందుకు పంచడం దండగా అని ముందుగానే గ్రహించుకొని కాస్త నిలుపుదల చేశారట.  దీంతో అక్కడి ప్రజలకు చుక్కలు కనబడుతున్నాయట. ఈ క్రమంలోనే ఎమ్మెల్యే అభ్యర్థి ఆదిమూలపు సురేష్ మరియు చెవిరెడ్డి మధ్య కోల్డ్ వార్ నడుస్తున్నట్లు తెలుస్తోంది. ఇటీవల టంగుటూరులో జరిగిన జగన్ మీటింగ్ కు పెద్ద ఎత్తున జనాలు వచ్చినట్టు చూపించి పేమెంట్ ఇవ్వాలని చెవిరెడ్డిని అడిగారట ఆదిమూలపు సురేష్.  కానీ నీ నక్క వేషాలు నా ముందు కాదంటూ చెవిరెడ్డి మండిపడ్డట్టు తెలుస్తోంది. సభ జనం లేక వెలవెల పోయిందని ఆయన మొహం మీదే చెప్పేశారట. అంతేకాకుండా కనిగిరిలో కూడా ఇదే పరిస్థితి ఏర్పడిందట.అక్కడి అభ్యర్థి  దద్దాల నారాయణ యాదవ్ కూడా ఇదే మాదిరిగా మొండి చేయి చూపించినట్టు తెలుస్తోంది.

ఎందుకంటే గత వారం నుంచి చెవిరెడ్డి డబ్బులు ఇచ్చి మరీ జనాలని తీసుకు రమ్మంటే  వాళ్ళు చాలా తక్కువ జనాలను తీసుకువచ్చి లిస్టులో మాత్రం ఎక్కువ జనాలని చూపించడంతో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వారిని ఎంతమందిని తీసుకొచ్చారో లెక్కలు చెప్పండి, ఇచ్చిన డబ్బు కూడా లెక్కలు చెప్తే మిగతా  అమౌంట్ ఇస్తానని తెగేసి చెప్పారట. దీంతో అక్కడి అసెంబ్లీ క్యాండిడేట్ లు అంతా నోరెళ్ళబెట్టినట్టు తెలుస్తోంది. అంతా ఓకే అయితే  మరోవైపు అసెంబ్లీలో పోటీ చేసేటువంటి అభ్యర్థులు  ఓటుకు రూ:1500 లెక్కన ఇస్తే జనాలు తిరస్కరిస్తున్నారట. ఇన్ని రోజుల నుంచి తిప్పించుకొని కనీసం రూ:5000 అయినా ఇవ్వాలి కదా అంటూ  అభ్యర్థుల మొహం మీద చెబుతున్నారట. అంతేకాకుండా కొంతమంది వైసీపీ నాయకులకు వచ్చిన డబ్బును జనాల్లోకి పంచే విషయంలో  చాలా కక్కుర్తి పడుతున్నట్టు తెలుస్తోంది. అక్కడి నుంచి రూ:1500 వస్తే జనాల్లో వీరు రూ:500 నోక్కేసి రూ రూ:1000 ఇస్తున్నారట.ఈ విధంగా వచ్చిన దాన్ని కూడా ప్రజల్లోకి సరైన విధంగా తీసుకెళ్లకపోవడంతో వైసీపీపై జనాల్లో కాస్త వ్యతిరేకత వస్తున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: