చంద్రబాబు కేబినెట్లో కీలక మంత్రి భూమా అఖిల ప్రియ పార్టీ మారుడు వ్యవహారం సమసిపోయినట్టేనా? ఈ వివాదం వెనుక అసలు లక్ష్యం నెరవేరి నట్టేనా? మంత్రి అఖిల వ్యూహం పక్కాగా అమలైందా? అంటే పరిశీలకులు ఔననే అంటు న్నారు. రాజకీయాల్లో అనేక వ్యూహాలు ఉంటాయి. నయం, భయం, బతిమాలడం వంటి కళలు రాజకీయాల్లో బాగానే పని చేస్తుంటాయి. ఈ క్రమంలో పార్టీ అధినేత చంద్రబాబు సహా కర్నూలు జిల్లా రాజకీయాల్లో తన పట్టు నిలుపుకొనేందు కు అఖిల ప్రియ వేసిన ఎత్తులో భాగంగానే దానిని సక్సెస్ చేసుకుని.. ఆనందిస్తున్నారని అంటున్నారు పరిశీలకులు. విష యంలోకి వెళ్తే.. మంత్రి అఖిల ప్రియ అటు సొంత నియోజకవర్గం ఆళ్లగడ్డలోను, ఇటు తన సొదరుడి నియోజకవర్గం నం ద్యాలలోనూ తీవ్ర ఎదురుగాలిని ఎదుర్కొంటున్నారు.
అదే సమయంలో పోలీసుల నుంచి కూడా తీవ్రమైన ప్రతిఘటనను ఎదుర్కొంటున్నా రు. మంత్రి వర్గంలోనూ చంద్రబా బు వద్ద ఆమెకు సరైన మార్కులు కూడా పడలేదు. తన అనుచరులు, పార్టీలో సన్నిహితులుగా ఉండే వారి ఇళ్లలో పోలీసు లు తనిఖీలు చేశారు. దీంతో పోలీసులపై పీకల వరకు కూడా ఆగ్రహంతో రగిలిపోతున్నారు అఖిల ప్రియ. పైకి మాత్రం పోలీసులపై వ్యాఖ్యలు చేస్తున్నా.. అంతర్గతంగా మాత్రం కీలక నాయకులపైనే ఆమె ఆగ్రహంతో ఉన్నారు. ఈ పరిణామా ల నేపథ్యంలో అఖిల ప్రియ పట్టు కోల్పోయారని , ఇక, చంద్రబాబు ఆమెను పక్కన పెట్టడమే మిగిలి ఉందని పెద్ద ఎత్తు న ప్రచారం ఊపందుకుంది. ఈ క్రమంలోనే అఖిల ప్రియ అధిరిపోయే ప్లాన్ చేసుకున్నారు.
తన అనుచరుల ద్వారా అఖిల ప్రియ, ఆమె సోదరుడు,ఎమ్మెల్యే బ్రహ్మానంద రడ్డిలు పార్టీ మారుతున్నారనే ప్రచారం కల్పించారు. చాలా పక్కాగా వ్యూహాత్మకంగా ఈ విషయంలో అడుగులు వేశారు. రాష్ట్రంలోను, జిల్లాలోనూ సంచలనం అయ్యే వరకు వేచి చూశారు. జనసేనలోకి ఈ ఇద్దరు వెళ్లనున్నారని, వచ్చే ఎన్నికల్లో జనసేన తరఫునే పోటీ చేయాలని అనుకుంటున్నారనే ప్రచారం ఊపందుకుంది. దీనితాలూకు రిజల్ట్ ఒక్కటే.. తమ ప్రభావమే ఎక్కువని, పార్టీలో తమ హవానే చెల్లుబాటు కావాలని అఖిల బావించారు.
అంటే పార్టీ అధినేత చంద్రబాబు కూడా వీరిని వదులుకుంటే.. ప్రమాదమే భావనలోకి రాగలిగారు. ఇప్పుడు ఇదే జరిగిందా? అంటే.. దాదాపు ఇదే తరహా వాతావరణం వచ్చి.. సీఎం చంద్రబాబు వద్ద చర్చ జరిగిన నేపథ్యంలో అఖిల తాజాగా తాను పార్టీ మారనని ప్రకటన చేసింది. మొత్తానికి ఈ మొత్తం ఎపిసోడ్లో అఖిల అనుకున్నది సాధించిందని.. ఇది బెదిరింపుల రాజకీయమే అన్న చర్చలు ఏపీ రాజకీయాల్లో వినపడుతున్నాయి.