గత కొద్దిరోజులుగా సాగుతున్న ఉత్కంఠకు తెలంగాణ సీఎం, టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ తెరదించారు. టీఆర్ఎస్ లోక్సభ అభ్యర్థుల జాబితాను ఖరారు చేసి విడుదల చేశారు. మొత్తం 17 మంది అభ్యర్థులను ఖరారు చేసి బీఫాంలు అందించారు. పార్టీలో చేరిన వారికి అదే రోజు ఎంపీ సీట్ ప్రకటించారు. ఇవాళే పార్టీలో చేరిన నామా నాగేశ్వరరావు, వేమిరెడ్డి నర్సింహారెడ్డి, వెంకటేష్ నేతకానిలకు చివరి నిమిషంలో చోటు దక్కింది.
టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థులు వీరే...
1. కరీంనగర్: బోయినపల్లి వినోద్ కుమార్
2. పెద్దపల్లి: వెంకటేశ్ నేతకాని
3. ఆదిలాబాద్: గోడెం నగేశ్
4. నిజామాబాద్: కల్వకుంట్ల కవిత
5. జహీరాబాద్: బీబీ పాటిల్
6. మెదక్: కొత్త ప్రభాకర్ రెడ్డి
7. వరంగల్: పసునూరి దయాకర్
8. మహబూబాబాద్: మాలోత్ కవిత
9. ఖమ్మం: నామా నాగేశ్వరరావు
10. భువనగిరి: బూర నర్సయ్య గౌడ్
11. నల్గొండ: వేమిరెడ్డి నరసింహ రెడ్డి
12. నాగర్ కర్నూల్: పోతుగంటి రాములు
13. మహబూబ్ నగర్: మన్నె శ్రీనివాస రెడ్డి
14. చేవెళ్ల: డాక్టర్ గడ్డం రంజిత్ రెడ్డి
15. సికింద్రాబాద్: తలసాని సాయికిరణ్ యాదవ్
16. మల్కాజిగిరి: మర్రి రాజశేఖర్ రెడ్డి
17. హైదరాబాద్: పుస్తె శ్రీకాంత్