కొవిడ్​ నిబంధనలను ఉల్లంఘించినందుకు ఓ వ్యక్తి భారీ జరిమానా చెల్లించాడు. ఒడిశాలోని దేవ్​గఢ్​లో ఓ పెళ్లి వేడుకకు భారీగా అతిథులను ఆహ్వానించినందుకు అతడికి జరిమానా విధించారు అధికారులు.దేవ్​గఢ్​లోని కమలా బాగిచా గ్రామానికి చెందిన వన్​ కులన్​ టోప్నో.. తన కుమారుడు అమిత్​ టోప్నోస్​ వివాహ వేడుకలను నిర్వహించాడు. ఈ కార్యక్రమానికి 800 మంది అతిథులు హాజరయ్యారు.



విషయం తెలుసుకున్న స్థానిక తహసీల్దార్​ పల్లవి నాయక్, స్థానిక పోలీసులు..​ పెళ్లి మండపానికి చేరుకున్నారు. కొవిడ్​ నిబంధనలను ఉల్లంఘించినందుకు వరుడి తండ్రికి రూ.లక్ష జరిమానా విధించారు.అసలే కరోనా కాలం. నిబంధనలు పాటించాలని అధికారులు చెబుతూనే ఉన్నారు. కానీ, ఎవరిదారి వారిదే! ఇలా నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు ఈ వ్యక్తి రూ.లక్ష జరిమానా చెల్లించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: