ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ పై పోరాటంలో వైసీపీ ప్రభుత్వం చాలా దూకుడుగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. చాలా కఠినం గా సిఎం వైఎస్ జగన్ నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇక వైద్యుల పని తీరు కూడా ఈ విషయంలో అభినందనీయం అనే చెప్పుకోవాలి. రికవరీ రేటు దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఆంధ్రప్రదేశ్ లో ఉన్న సంగతి తెలిసిందే.
దీనిపై వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ట్విట్టర్ లో వ్యాఖ్యలు చేసారు. కరోనా నుంచి కోలుకున్న రోగుల జాతీయ సగటు 40 శాతం కంటే లోపే ఉందని... ప్రపంచ యావరేజి కూడా ఇంచుమించు ఇంతే అన్నారు ఆయన. సిఎం జగన్ గారు తీసుకున్న ప్రత్యేక చర్యలు, వైద్య సిబ్బంది అత్యుత్తమ చికిత్స అందించడం వల్ల రాష్ట్రంలో రికవరీ రేటు 68 శాతంగా రికార్డయిందని పేర్కొన్నారు. ప్రాణాంతక వైరస్ పై ఇది అసాధారణ విజయమన్నారు.
కరోనా నుంచి కోలుకున్న రోగుల జాతీయ సగటు 40 శాతం కంటే లోపే ఉంది. ప్రపంచ యావరేజి కూడా ఇంచుమించు ఇంతే. సిఎం జగన్ గారు తీసుకున్న ప్రత్యేక చర్యలు, వైద్య సిబ్బంది అత్యుత్తమ చికిత్స అందించడం వల్ల రాష్ట్రంలో రికవరీ రేటు 68 శాతంగా రికార్డయింది. ప్రాణాంతక వైరస్ పై ఇది అసాధారణ విజయం.
— Vijayasai reddy v (@VSReddy_MP) May 24, 2020