దేశీయ మార్కెట్ లో బంగారం ధర రెండు రోజులు తగ్గుముఖం పట్టిన ఈ రోజు భారీగా పెరిగింది. ఇక హైదరాబాద్ మార్కెట్ లో కూడా పసిడి ధర కూడా భారీగా పెరిగింది. శుక్రవారం నాటికి 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.500 పెరగడంతో ధర రూ..54,030కి చేరింది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.500 పెరగడంతో రూ.51,460 కి చేరింది. గత కొద్ది రోజులుగా బంగారం ధర భారీగా తగ్గుతూ వస్తోంది.  దీంతో పసిడి ప్రియులకు చేదువార్త అనే చెప్పుకోవచ్చు. విజయవాడలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ..54,030, 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.51,460కి చేరింది.

దేశీయ మార్కెట్ లో పసిడి ధర తగ్గినా వెండి ధర మాత్ర పరుగులు తీసింది. మార్కెట్ కేజీ వెండి ధర ఏకంగా రూ.1200 పెరగడంతో ధర రూ.68,921 లకు చేరింది. భారత దేశ రాజధాని ఢిల్లీ మార్కెట్ లో కూడా పసిడి ధర భారీగా తగ్గతూ వస్తోంది. 24 క్యారెట్ల 45 గ్రాముల బంగారం ధర రూ.500పెరగడంతో ధర రూ.54,930కు చేరింది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.500 పెరగడంతో రూ.50.450కు చేరింది. రాజధానిలో కూడా వెండి ధర భారీగా పెరిగింది. 10 గ్రాముల వెండిధర రూ.1200పెరగడంతో రూ.68,921కు చేరింది.

పరిశ్రమ యూనిట్లు, నాణేపు తయారీదారుల నుంచి డిమాండ్ పడిపోవడం వల్ల ధరలు పెరగుదల, తగ్గుదలకు కారణమవుతున్నాయని నిపుణులు పేర్కొంటున్నారు. మరియు అమెరికా-చైనా ఉద్రిక్తతలు, కరోనా వైరస్ ప్రతికూల పరిస్థితుల వల్ల పసిడి స్థిరంగా ఉండటానికి దోహదపడుతున్నాయని, బంగారం ధర స్థిరంగా ఉంటే వెండి ధర పెరుగుతోంది నిపుణులు పేర్కొంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: