* ప్రత్యర్థి ఇచ్చేదానిపై రూ.500 పెంపు
* తగ్గేదిలేదంటున్నా అధికార పార్టీ
ప్రధాన పార్టీలు వారి దృష్టి మొత్తం ప్రస్తుతం డబ్బు పంపిణీపై పెట్టాయి. అయితే ఇప్పటికే కొన్నిచోట్ల పంపిణీ ప్రక్రియ ప్రారంభమైంది. కొన్ని చోట్ల ఒక్క ఓటు కనీసం 3000 నుంచి 4000 పలుకుతుంది.వైసీపీ నేతలు ఎన్నికలకు ముందే తొలి విడత నగదు పంపిణీ పూర్తి చేయాలన్న ఉద్దేశంతో అడుగులు వేస్తున్నారు. టీడీపీ, జనసేన, బీజేపీ కూట మికి, వైసీపీకి నడుమ పోటాపోటీగా ఉన్న స్థానాల్లో తొలి విడతగా ఒక్కో ఓటరుకు 2000 నుంచి 3000 పంపిణీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. రెండో విడత నగదు ఎంత మొత్తం ఇవ్వాలనేది నిర్ణయించాలని ప్రధాన పార్టీ నేతలు భావిస్తున్నారు. దీంతో ఈసారి ఓటు రేటు రూ.4 వేల నుంచి రూ.5 వేల వరకు వెళ్లే అవకాశం ఉందని తెలుస్తోంది.అయితే ఈ పంపిణిలో భాగంగా పల్నాడు పార్లమెంట్ పరిధిలో ఉన్న ఏడు నియోజకవర్గాల్లో భారీగా డబ్బులు పంచే ప్రక్రియ ప్రారంభం యింది. టీడీపీ మాత్రం ఇంకా ఆ ప్రక్రియ స్టార్ట్ చేయలేదు. ఉద్యోగులలో స్పష్టంగా కనిపించిన వ్యతిరేకత, తటస్థ ఓటర్లలో టీడీపీ అనుకూల వాతావరణం బహిర్గతం కావడంతో వైసీపీ నాయకులు ఓట్ల కొనుగోలుకి భారీ రేటు పెట్టారని ప్రచారం జరుగుతోంది.ప్రత్యర్థి ఇచ్చే దాన్ని బట్టి ఇంకో 500 నుండి 1000 కలిపి ఇచ్చే పనిలో టీడీపీ ఉందని తెలుస్తుంది.ఈ ఏడు నియోజకవర్గాల్లో 1500-2000 కోట్లు ఖర్చు అవుతాయని విశ్లేషకులు లెక్కలు వేస్తున్నారు.