
కానీ ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షంతో ఇక మ్యాచ్ నిర్వహించే అవకాశాన్ని మాత్రం ఎక్కడా ఇవ్వలేదు. దీంతో ఇక ఫైనల్ మ్యాచ్ కోసం కేటాయించిన రిజర్వుడే రోజు మ్యాచ్ నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. దీంతో నేడు ఫైనల్ మ్యాచ్ జరగబోతుంది అన్న విషయం తెలిసిందే. అయితే ఇక ఫైనల్ మ్యాచ్ కాస్త ఆలస్యం కావడంతో ఈ మ్యాచ్ పై మరింత ఉత్కంఠ పెరిగిపోయింది. ఈ క్రమంలోనే ఎన్నో ఆసక్తికర విషయాలు కూడా సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోతుంది. ఐపీఎల్ ఫైనల్ లో విజేతగా నిలిచిన టీంకి 20 కోట్ల ప్రైస్ మనీ దక్కుతుంది అన్న విషయం తెలిసిందే. ప్రైజ్ మనీ తో పాటు ట్రోఫీ కూడా దక్కుతుంది.
ఇక మరోవైపు రన్నరప్ గా నిలిచిన టీం కి 13 కోట్ల ప్రైస్ మనీ ఇస్తారు. ఇదిలా ఉంటే అటు ప్రతి సీజన్లో గెలిచిన టీం కి అందించే ఐపీఎల్ ట్రోఫీ పై సంస్కృతంలో కొన్ని వ్యాఖ్యలు రాసి ఉంటాయి. అయితే దీని అర్థం ఏంటి అనేది మాత్రం చాలా మందికి తెలియదు. ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. అయితే ట్రోఫీపై యత్ర ప్రతిభ.. అవసర ప్రాప్రోతిహా అని రాసి ఉంటుందట. అంటే ఎక్కడ ప్రతిభ ఉంటుందో వారికి అవకాశం లభిస్తుంది ఈ సంస్కృతం వ్యాఖ్యల అర్థం వస్తుందట.