శ్రీకాకుళం జిల్లా కేంద్రంలోని నాగావళి నదీ తీరంలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరించి సమీపంలోని ఉమా రుద్ర కోటేశ్వర ఆలయంలో స్వామి వారిని దర్శించుకున్నారు. ఇక రాజమహేంద్రవరంలో భక్తులు గోదావరి నదిలో పుణ్య స్నానం చేశారు. తెల్లవారుజాము 3 గంటల నుంచే పుష్కర ఘాట్ వద్ద భక్తుల సందడి మొదలైంది. గోదారమ్మకు దీపాలతో నైవేద్యం సమర్పించారు. నదీ తీరంలోని కైలాస నాథుని ఆలయంలో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహంచారు. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలోని గోదావరి నదీ తీరంలో ఉన్న శివాలయంలో మహిళలు పెద్ద ఎత్తున పూజలు నిర్వహించారు. విజయవాడలోని కృష్ణా నదిలోని పవిత్ర స్నానామచరించి... ఇంద్రకీలాద్రిపై వెలసిన దుర్గా మల్లేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. అటు జ్యోతిర్లింగ క్షేత్రమైన శ్రీశైల దివ్య క్షేతంలో తెల్లవారు జాము నుంచే ప్రత్యేక పూజలు, అభిషేకాలు జరుగుతున్నాయి. ఇక రాష్ట్రంలోని పంచారామ క్షేత్రాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. భక్తుల సందడితో ఆలయాలు కిటకిటలాడుతున్నాయి. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఆలయ నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి