ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆయన కేవలం సింగర్ గానే కాకుండా నటుడిగా, డబ్బింగ్ ఆర్టిస్ట్ గా ఇంకా మ్యూజిక్ డైరెక్టర్ గా కూడా రాణించారు. మిగతా సింగర్స్ కంటే బాల సుబ్రహ్మణ్యం చాలా ప్రత్యేకం.ఆయనకు భాషలు ఇంకా యాసల మీద పట్టుంది. ఎస్పీ బాల సుబ్రహ్మణ్యంలో మాత్రమే ఉన్న మరో అరుదైన క్వాలిటీ ఏంటంటే అద్భుతమైన మిమిక్రీ. ఆయన మంచి మిమిక్రీ ఆర్టిస్ట్ కూడా. స్టార్ హీరోలను కమెడియన్స్ ని చాలా పర్ఫెక్ట్ గా ఇమిటేట్ చేశారు. ఇక ఈ స్కిల్ ఆయనకు చాలా ఉపయోగపడింది. ఆర్టిస్ట్ కి తగ్గట్లు గొంతు మార్చి పాడగల నేర్పరి బాల సుబ్రహ్మణ్యం.ఎన్టీఆర్ కి ఒకలా ఏఎన్నార్ కి మరోలా బాలు గారు పాడతారు. వారు పాడితే ఎలా ఉంటుందో తన గాత్రంలో శృతి తప్పకుండా ఆయన పాడి చూపిస్తారు. ఇక ఇది బాలును మరింత ప్రత్యేకంగా మార్చేసింది. బాల సుబ్రహ్మణ్యం తన మిమిక్రీ కళను చూపిస్తూ ఓ వీడియో కూడా చేశారు.


మిస్సమ్మ మూవీలోని ఆల్ టైం హిట్ 'రావోయి చందమామ' పాటను ఎన్టీఆర్, ఏఎన్నార్, రాజబాబు ఇంకా అల్లు రామలింగయ్య పాడితే ఎలా ఉంటుందో చూపించారు.ఆ రేర్ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది. నేడు ఎస్పీ బాలు జయంతి నేపథ్యంలో ఆయన అభిమానులు ఆయన్ని స్మరించుకుంటున్నారు. బాలు ఈ లోకాన్ని వీడి మొత్తం రెండేళ్లు దాటిపోయింది. 2020 సెప్టెంబర్ 25 వ తేదీన ఎస్పీ బాలు అనారోగ్యంతో కన్నుమూశారు. ఆయనకు కరోనా మహమ్మారి సోకింది. ఆసుపత్రిలో చేరిన బాలు గారు మైల్డ్ అటాక్ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వీడియో విడుదల చేశారు. అవే ఆయన మాట్లాడిన చివరి మాటలు. దాదాపు నెల రోజుల పాటు మృత్యువుతో పోరాడి బాలు గారు మరణించారు. జూన్ 4న 1946లో నెల్లూరులో ఎస్పీ బాలు గారు జన్మించారు. ఇక ఎస్పీ బాలు సంగీత ప్రపంచాన్ని తిరుగులేని రారాజుగా ఏలారు. ఎన్నో దశాబ్దాల పాటు ఆయన గాత్రం విరామం లేకుండా వినిపించింది. ఎస్పీ బాలు చాలా భాషల్లో డెబ్భై వేలకు పైగా పాటలు పాడి రికార్డు సృష్టించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: