తెలుగు సినీ పరిశ్రమలో నటుడుగా తనకంటూ ఒక మంచి గుర్తింపును ఏర్పరచుకున్న వారిలో మంచు విష్ణు ఒకరు. ఈయన కలెక్షన్ కింగ్ మోహన్ బాబు కుమారుడిగా సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చి తన కెరియర్ లో కొన్ని విజయాలను అందుకొని నటుడిగా తనకంటూ ఒక ప్రత్యేక ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్నాడు. ఇకపోతే ఆఖరుగా ఈయన జిన్నా అనే సినిమాలో హీరోగా నటించాడు. ఈ మూవీ లో పాయల్ రాజ్పుత్ , సన్ని లియోన్ హీరోయిన్ లుగా నటించారు. 

పర్వాలేదు అనే స్థాయి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఘోర పరాజయాన్ని ఎదుర్కొంది. ఇకపోతే ఈ మధ్య కాలంలో వరస అపజయాలను ఎదుర్కొంటున్న విష్ణు ప్రస్తుతం కన్నప్ప అనే భారీ బడ్జెట్ సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఇక ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శర వేగంగా జరుగుతుంది. ఈ మూవీ లో ఎంతో మంది గొప్ప గొప్ప నటులు నటిస్తున్నారు. కొన్ని రోజుల క్రితమే బాలీవుడ్ ఇండస్ట్రీ లో స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి అక్షయ్ కుమార్ కూడా ఈ సినిమాలోని తన భాగం షూటింగ్ ను పూర్తి చేసుకుని వెళ్లి పోయాడు.

ఈ విషయాన్ని మూవీ యూనిట్ కూడా అధికారికంగా ప్రకటించింది. ఇక ఈ సినిమాలో రెబల్ స్టార్ ప్రభాస్ ఓ కీలకమైన పాత్రలో కనిపించబోతున్నట్లు మేకర్స్ చాలా రోజుల క్రితమే ప్రకటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఇకపోతే ప్రభాస్ నిన్న ఈ మూవీ షూటింగ్ లోకి జాయిన్ అయ్యాడు. ఈ విషయాన్ని మేకర్స్ అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్ ను కూడా విడుదల చేశారు. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ మూవీ లో ఎంతో మంది గొప్ప గొప్ప నటులు నటిస్తూ ఉండడంతో ఈ మూవీ పై ప్రస్తుతానికి ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: