మనం కష్టపడి సంపాదించినటువంటి డబ్బులను ఏదైనా బ్యాంకు ఖాతాలలో సేవింగ్స్ అకౌంట్లు, ఫిక్స్డ్ డిపాజిట్స్, రికవరీ డిపాజిట్లలో డబ్బులను దాచుకుంటారు. అయితే వారికి అవసరమైనప్పుడు మాత్రమే ఈ డబ్బులను తీసుకుంటారు. అందుకుగాను బ్యాంకులు వడ్డీ కూడా చెల్లిస్తాయి. డిపాజిట్  చేసిన ఎవరూ కూడా క్లైయిమ్  చేసుకొని డబ్బు రోజురోజుకి బ్యాంకులలో పెరిగిపోతోంది .అలా ఎన్నో ఏళ్ల తరబడి బ్యాంకు ఖాతాలో ఉండి ఇప్పటికీ డ్రా చేయని అకౌంట్లో డబ్బులు రూ. 67 వేల కోట్ల రూపాయలకు చేరింది. ఇందులో అత్యధికంగా 29 శాతం వరకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లో కలదు.



RBI తెలిపిన వివరాల ప్రకారం జూన్ 30 2025 నాటికి క్లైమ్ చేయని డిపాజిట్లలో 58,330.26 కోట్ల రూపాయలు ఉందా ఇక ప్రైవేట్ సెక్టార్ బ్యాంకుల విషయానికి వస్తే రూ . 8,673.72 కోట్ల రూపాయలు ఉన్నదని తెలిపారు. ఇందులో ఎస్బిఐలో రూ. 19,329.92 కోట్లు, పంజాబ్ నేషనల్ బ్యాంకులో రూ. 6,910.67 కోట్లు, కెనరా బ్యాంకులో రూ. 6,278.19 కోట్లు ఉన్నట్లుగా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి పంకజ్ చౌదరి తెలియజేశారు. ఇదే కాకుండా మరికొన్ని బ్యాంకు సెక్టార్లలో ఉన్నాయంటూ తెలిపారు.

ముఖ్యంగా ఈ డిపాజిట్లలో ఎక్కువమంది తమ కుటుంబ సభ్యుల వివరాలకు సంబంధించిన పత్రాలను సమర్పించలేక ఆ అకౌంటలలో డబ్బులు అలాగే మిగిలిపోయినట్లుగా తెలుస్తోంది. మరి కొంతమంది మాత్రం వృద్ధాప్యంలో తమ పిల్లలు తమను వదిలేస్తే పరిస్థితి ఏంటి అనే విషయాన్ని గ్రహించి.. పిల్లలకు చెప్పకుండా డబ్బులు అవసరమని భావించి దాచుకుంటున్నారు. అలా మిగిలిపోతున్నటువంటి డబ్బులే రూ.67 వేల కోట్లు ఉన్నాయి. ఇలాంటి వాటిని కొన్ని రోజులు పోయిన తర్వాత RBI లెక్క చెప్పి మరి ప్రభుత్వానికి జమ చేస్తోంది. అలా ఇప్పటికే రూ.2000 కోట్ల రూపాయలను జమ చేయగా, ఇప్పుడు ఏకంగా 67 వేల కోట్ల రూపాయలకు చేరింది.  మరి ఈ డబ్బులను RBI ఏం చేస్తుందనే విషయం తెలియాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: