
రెండవ దశ కరోనా వైరస్ ప్రభావం తగ్గింది ఇక మా చదువులను సాఫీగా కొనసాగించవచ్చు అని ఎన్నో ఆశలు పెట్టుకున్నారు విద్యార్థులు. ఇక అన్ని పరిస్థితులు చక్క బడుతున్నాయి అనుకుంటున్న సమయంలో మళ్లీ ఒకవైపు ఓమిక్రాన్ కేసులు పెరిగిపోవడం ఇంకోవైపు కరోనా వైరస్ కేసులు పెరిగిపోవడంతో విద్యా సంస్థలు మూతపడటం పరీక్షలు వాయిదా పడటం లాంటివి మరోసారి జరుగుతున్నాయి. ఇప్పటికే ప్రభుత్వాలు కరోనా వైరస్ కేసులు పెరిగిపోతున్న నేపథ్యంలో కఠిన ఆంక్షలు తీసుకొస్తున్నాయి.. ఇక ఇప్పుడు మరోసారి పరీక్షలను వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకున్నారు.
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో కూడా పరీక్షలు నిర్వహించాల్సి ఉంది. కానీ అన్ని పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు ఇటీవలే విశ్వవిద్యాలయం పరీక్షల నియంత్రణ అధికారి డాక్టర్ ఎవియం రెడ్డి ప్రకటనలో అధికారికంగా తెలపడం గమనార్హం. దీంతో ఎంతోమంది విద్యార్థులు అందరికీ కూడా నిరాశే ఎదురైంది అని చెప్పాలి ఈనెల 30వ తేదీ వరకు జరగబోయే అన్ని రకాల పరీక్షలను కూడా వాయిదా వేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. ఇక ఇప్పుడు వాయిదా పడిన పరీక్షలను ఎప్పుడు నిర్వహించబోతున్నాము అన్న విషయాన్ని రానున్న రోజుల్లో ప్రకటిస్తామని చెప్పుకొచ్చారు.